Bhatti Vikramarka : ఇందిరమ్మ పాలనలో వెలుగుల ప్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అశ్రద్ధ మూలంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితి నుంచి వెలుగుల వైపు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను నడిపించేందుకు భట్టి విక్రమార్క నడుం బిగించారు. 2023 డిసెంబర్ 7న ప్రమాణా స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంటు నిర్మాణాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గత పాలకుల వైఫల్యాల వల్ల నిలిచిపోయిన పనుల గురించి తెలుసుకొని యుద్దప్రాతిపదికన ఆపనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. నేరుగా పవర్ ప్లాంట్ ను సందర్శించి అధికారులతో సమీక్షించారు. గత మూడు నెలల కాలంలో పలలుమార్లు సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షలు జరిపి పనుల్లో వేగం పెంచిన ఫలితంగా కేంద్రంలో పెండింగ్లో ఉన్న పర్యావరణలు అనుమతులు మంజూరయ్యాయి. భట్టి విక్రమార్క చొరవతో సాధించిన అనుమతుల వల్ల ఇందిరమ్మ పాలనలో వెలుగుల ప్రస్థానం మొదలైంది.
50% విదేశీ బొగ్గు, 50% స్వదేశీ బొగ్గుతో దామరచర్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని 2017 జూన్ 15న నాటి ప్రభుత్వం కేంద్ర నుంచి పర్యావరణ అనుమతులు సాధించింది. ఒప్పందానికి భిన్నంగా నూరు శాతం స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు చేసింది. మార్చిన టెక్నాలజీతో పర్యావరణం దెబ్బతింటుందని స్వచ్ఛంద సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశాయి. టెక్నాలజీకి అనుగుణంగా అనుమతులు పొందాలని 2022 సెప్టెంబర్ 30న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించి, అనుమతులు నిలిపేసింది. 2023 డిసెంబర్ 6 వరకు అధికారంలో ఉన్న గత పాలకులు పర్యావరణ అనుమతులు సాధించేందుకు ఎలాంటి చొరవ చూపలేదు. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క పట్టు పట్టి మారిన టెక్నాలజీకి అనుగుణంగా అనుమతులు సాధించేందుకు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజానీకాన్ని సమన్వయం చేసుకోని ఈ సంవత్సరం ఫిబ్రవరి 20న మరో సారి ప్రజాభిప్రాయసేకరణ విజయవంతంగా పూర్తి చేయించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచించిన షరతులు అన్నిటిని పూర్తిచేసి రెండు నెలల కాలంలోనే అనుమతులు సాధించారు. ఫలితంగా 2025 ఫిబ్రవరి నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అడ్డంకులు తొలగిపోయాయి. పర్యావరణ అనుమతులు రావాడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈసందర్భంగా డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
- Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
తాజావార్తలు
-
Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
-
OG 2 Heroine: ‘ఓజీ 2’ హీరోయిన్.. ఇదెక్కడి రచ్చ మామ!
-
Peddi OTT: ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ వాయిదా? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
-
Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
-
Anirudh : టాలీవుడ్ ప్రొడ్యూసర్ల ‘అనిరుధ్’ జపం.. ఏకంగా రూ. 25 కోట్లకు చేరిన రెమ్యునరేషన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!