ఖమ్మం జిల్లా ఏ మాటకు ఆమాట కాంగ్రెస్ జిల్లా అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోయినసారి ఇదే ఫలితం వచ్చింది... మేము ఇతర పార్టీల్లో గెలిచాం.. పువ్వాడ అజయ్ మాత్రమే పార్టీలో గెలిచారు.. జిల్లాలో కాంగ్రెస్ గాలి మనకు ఉరితాళ్ళు అయినవి.. తమ్మినేని వీరభద్రంకు కూడా ఓట్లు పడలేదు అని ఆయన పేర్కొన్నారు.
యూపీలో కాంగ్రెస్ జోరు కాస్త తగ్గింది. తెలంగాణలో పార్టీ విజయం తర్వాత యూపీలో ముస్లిం ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. భారత కూటమిని సజీవంగా ఉంచడానికి యూపీలో కాంగ్రెస్ అనేక రాజీలు చేయాల్సి రావచ్చు.. ఇది జరగకపోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో యూపీలో ఆ పార్టీ ఒంటరి అవుతుంది అని సమాజ్ వాద్ పార్టీ నేతలు చెబుతున్నారు.
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్.. మంత్రులు ఎవరు, ఎల్లుండి ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు? అనే విషయాలు తర్వాత చెబుతాం అన్నారు.. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది.. అంతా టీమ్గా పనిచేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్.
CPI Narayana: ఐదు రాష్ట్రాల ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాగానే టూరిజం ఆఫీస్ తగలబడిందన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు అందింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్కు కాంగ్రెస్ నేత, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఫిర్యాదు చేశారు. వెంటనే కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని ఆయన సీఈఓను కోరారు. కాగా ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు మాత్రం ఉండటంతో పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి కార్యాకలాపాలు నిర్వహించకుండ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ను…
అమర వీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నక్క లాగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ చేతిలో తెలంగాణ ప్రజలు పడకూడదని, కుటుంబ, అవినీతి, అహంకార పార్టీలు తెలంగాణకు అవసరం లేదన్నారు. అబద్ధాలు, మోసాలు, కుట్రలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎవరు నెరవేరుస్తారో గుర్తించారు.. కాబట్టే బీజేపీకి రోజు రోజుకూ…
మాజీ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో ఇటీవల ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో నుంచి అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించింది. దీనిపై ముందుస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు చేయడాన్ని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ఖండించారు. మంగళవారం ఏకే గోయల్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ఎన్నికల ప్రచారం సీఎల్పీ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి భట్టి విక్రమార్క్ మరో ముందడుగు వేశారు. సోమవారం ఖమ్మంలో ప్రచారం చేపట్టిన భట్టి ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. ఈ ప్రచారంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చొప్పికట్లపాలెంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రమాణం చేశారు. అవినీతి రహితంగా వ్యవహరిస్తానని ఆంజనేయస్వామి ఎదుట ప్రమాణం చేశారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. ‘రైతుబంధు ఆపింది కాంగ్రెసేనంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘రైతులను కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలే మోసం…