Off The Record: హైదరాబాద్ ఎందుకు హస్తగతం కాలేదు? ఆ వర్గాలు ఎటు మళ్లాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కాంగ్రెస్ పార్టీ ఆశించినట్టుగానే.. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కానీ, అనుకున్నన్ని సీట్లు మాత్రం రాలేదన్నది ఆ పార్టీ అగ్ర నేతల అభిప్రాయమట. జిల్లాల వారీగా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే… గ్రామీణ ప్రాంతాల్లో అన్నిచోట్ల హస్తం హవా కనిపించింది. ఒక్క నిజామాబాద్ జిల్లాలో తప్ప మిగిలిన చోట్ల ఆశించిన స్థాయిలోనే వర్కౌట్ చేసుకోగలిగింది కాంగ్రెస్. కానీ… హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రం ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయింది. మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎందుకు వెనకబడ్డామన్న చర్చ గట్టిగానే మొదలైందట పార్టీలో. గ్రేటర్ ప్రజలు బీఆర్ఎస్వైపు మొగ్గడానికి కారణాలపై పోస్ట్మార్టం మొదలైనట్టు తెలిసింది.
గ్రేటర్ హైదరాబాద్లో కచ్చితంగా గెలుస్తామనుకున్న ఖైరతాబాద్, ఎల్బీనగర్, మేడ్చల్, మల్కాజిగిరి, అంబర్పేట లాంటి నియోజకవర్గాలు చేజారడంపై పార్టీ వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తం అవుతోందట. ఎన్నికలకు ముందు మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సెటిలర్స్, టీడీపీ సానుభూతిపరుల ఓట్ బ్యాంక్ మొత్తం సాలిడ్గా తమకు మళ్ళుతుందని అంచనా వేసింది కాంగ్రెస్. కానీ.. ఫలితాలను చూస్తే.. అలాంటి ప్రభావం పెద్దగా లేదన్న నిర్ణయానికి వచ్చిందట. మరీ ముఖ్యంగా పార్టీ ఆశలు పెట్టుకున్న టిడిపి ఓటు బ్యాంక్ పెద్దగా కాంగ్రెస్ వైపు మళ్ళినట్టు కనిపించలేదు. అదే సమయంలో గ్రేటర్ పరిధిలో సెటిలర్స్ ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కారు పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. అటు బీజేపీని కూడా ఆదరించారు తప్ప ఏ దశలోనూ కాంగ్రెస్ వైపు మొగ్గలేదు.
Also Read
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
తమకు బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఓడిపోవడంతో… సెటిలర్స్, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తమకు పడలేదని, అవి బీఆర్ఎస్కే మళ్ళాయన్న అంచనాకు వచ్చారట కాంగ్రెస్ పెద్దలు. అంటే… ఆ వర్గాలన్నీ కాంగ్రెస్ను నమ్మలేదా? కలిసి నడవడానికి ఇష్టపడలేదా? లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వస్తాయనుకున్న గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమకు పట్టం కట్టారని, ఆశలు పెట్టుకున్న గ్రేటర్ పరిధిలో హ్యాండ్ ఇచ్చారన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో గట్టిగానే జరుగుతోందట. మొత్తంగా గ్రేటర్ వైఫల్యాలపై త్వరలోనే సమీక్ష జరిపి వ్యవహారాన్ని సెట్ చేయాలని పీసీసీ అనుకుంటున్నట్టు తెలిసింది.
తాజావార్తలు
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!