Telangana Election: ఏంటీ.. ఈ ఊళ్లో పోలింగ్ జరగలేదా? మరీ..!
Telangana Election: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సాఫీగా సాగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు సుముఖత చూపలేదు. పోలింగ్ను పూర్తిగా బహిష్కరించారు. గతవారం రాజస్థాన్లోని ఓ గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంది. మూడు దశాబ్దాలుగా వారికి సరైన రోడ్లు వేయడంలో నాయకులు చొరవ చూపకపోవడంతో ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కానీ మన తెలంగాణాలో ఇలాంటి ఘటన జరగడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి గ్రామం ఇటీవల గొల్లగడ్డ పేరుతో కొత్త పంచాయతీగా ఏర్పడింది. ఈ మండలంలో 26 గ్రామాలు ఉండగా ఓటు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సాధారణంగా ఇక్కడ 80 శాతం ఓటింగ్ ఉన్నప్పటికీ ఓటు వేయకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి?.
Read also: CPI Narayana: చంద్రబాబు లాగే కేటీఆర్ పరిస్థితి.. ప్రజలు బుద్ది చెప్తారు..
Also Read
ఆదిలాబాద్ జిల్లాలో 79.86 శాతం ఓటింగ్ జరిగింది. అయితే కొన్ని గ్రామాల్లో నాయకుల తీరుపై ఓటర్లు విరుచుకుపడ్డారు. తమకు డబ్బులు పంచలేదని, సంక్షేమ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోందని కొద్ది మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. కానీ రాజకీయ నాయకులు తమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని, ప్రచార సమయంలో కూడా ఎవరూ పలకరించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని గొల్లగడ్డ గ్రామస్తులు పోలింగ్ను బహిష్కరించారు. ఈ విషయం తెలుసుకున్న నాయకులు, అధికారులకు ఎంత చెప్పినా ఫలితం లేకపోయింది. కలెక్టర్ తమ వద్దకు వచ్చి న్యాయం చేస్తామని చెబితే పోలింగ్లో పాల్గొంటామని నిరసన తెలిపారు. ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. కలెక్టర్తో మాట్లాడిన గ్రామస్తులు నమ్మకపోవడంతో ఓటు వేయడానికి భయపడి అక్కడే కూర్చున్నారు. దీంతో పోలింగ్ అధికారులు చేసేదేమీ లేక సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Animal Movie Review: ‘యానిమల్’ మూవీ రివ్యూ!
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో