శబరిమల విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ‘సైట్ క్లియరెన్స్’ మంజూరైంది. ఏప్రిల్ 3న జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేరళలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎమ్డిఆర్ఎఫ్) దుర్వినియోగం కేసును లోకాయుక్త పూర్తి స్థాయి బెంచ్ పరిశీలించనుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎమ్డిఆర్ఎఫ్) దుర్వినియోగం ఆరోపణల కేసులో తీర్పును పెద్ద బెంచ్కు రిఫర్ చేయాలనే దాని ద్విసభ్య బెంచ్ నిర్ణయించింది.
Kerala: కేరళలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ మాట్లాడుతూ.. పినరయి విజయన్ ప్రభుత్వం కన్నా ఆవులే మేలు అంటూ వ్యాఖ్యలు చేశారు. కేరళలో మంత్రుల కన్నా ఆవులే ప్రజలకు ఎక్కువ సహకారాన్ని అందిస్తున్నాయని అన్నారు. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆవుల వల్ల ప్రజలకు ఆదాయం సమకూరుతుందని అన్నారు.
Kerala orders probe into row over youth fest theme song: కేరళలో యూత్ ఫెస్టివ్ సాంగ్, డ్యాన్స్ స్కిట్ వివాదాస్పదం అయింది. అక్కడి ప్రతిపక్ష పార్టీలు దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అధికార లెఫ్ట్ కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ వర్గాన్ని కించపరిచేలా ఈ పాట, డ్యాన్స్ స్కిట్ ఉందని ఆరోపిస్తున్నారు. దీంతో సీఎం పినరయి విజయన్ సర్కార్ దీనిపై విచారణకు ఆదేశించింది. ఇటీవల కోజికోడ్ లో జరిగిన యూత్ ఫెస్టివల్ స్వాగత గీతం, డ్యాన్స్ స్కిట్…
Governor vs CM in Kerala: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా తయారైంది అక్కడి పరిస్థితి. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం వివాదం కేరళ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు సోమవారం ఉదయం 11.30లోగా వైదొలగాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ రాజకీయ దుమారం ఏర్పడింది. ఈ వివాదాస్పద…
Kerala Replacing Punjab As Capital Of Drugs Governor says Governer Arif Mohammed Khan: కేరళ గవర్నర్ ఆరిప్ మహ్మద్ ఖాన్ రాష్ట్ర పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ క్యాపిటల్ గా ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కేరళ అధిగమిస్తుందని అన్నారు. కేరళ రాష్ట్రానికి కేవలం మద్యం, లాటరీలే ఆదాయవనరులుగా ఉండటాన్ని చూసి సిగ్గుపడుతున్నానని శనివారం ఆయన అన్నారు. మద్యం వినియోగానికి అందరూ వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే కేరళ మాత్రం దీనిని ప్రోత్సహిస్తోందని లెఫ్ట్…
Kerala A Hot Spot of Terrorism says jp nadda: కేరళలో తీవ్రవాదం ఎక్కువ అయిందని.. ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారిందని.. ఇక్కడ జీవితం సురక్షితంగా లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేరళలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబం కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆరోపించారు. వామపక్షాలు కుటుంబ, రాజరిక పాలనలో పడిపోయాయని ఆరోపించారు. పినరయి విజయన్ కూతురు, అల్లుడు ప్రభుత్వ…
Kerala stray dog menace: కేరళలో ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. కుక్కలను చూస్తేనే జనాలు వణికిపోతున్నారు. నడిరోడ్డపై వెళ్తున్న ప్రజలపై దారుణంగా దాడులు చేస్తున్నాయి. కేరళలోని వీధి కుక్కల బెడద దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పలు సందర్భాల్లో వీధి కుక్కలు చేసిన దాడులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేరళలో ఏ ఏడాది కుక్క కాటు వల్ల రేబిస్ సోకి ఇప్పటి వరకు 21 మంది మరణించారు. దీన్ని బట్టి చూస్తే అక్కడ…
Kerala starts government-owned online cab service: వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంది కేరళ ప్రభుత్వం. గతంలో కేరళ సొంతగా ప్రభుత్వ ఓటీటీ ‘సీ స్పెస్’ ని ప్రారంభించింది. నవంబర్ 1 నుంచి దీని సేవలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోనే కేరళ ప్రభుత్వం ప్రజలకు మరన్ని సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. చవకగా, ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా పలు పథకాలను తీసుకువస్తోంది.
Heavy rains in Kerala: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, కన్నూర్ జిల్లాల్లో గురువారం రోజు మొత్తం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురం మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ.24 గంటల్లో 20 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షం కురిస్తే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.