Kerala: వివాదంలో యూత్ ఫెస్టివల్ సాంగ్.. విచారణకు కేరళ ప్రభుత్వం ఆదేశం..
Kerala orders probe into row over youth fest theme song: కేరళలో యూత్ ఫెస్టివ్ సాంగ్, డ్యాన్స్ స్కిట్ వివాదాస్పదం అయింది. అక్కడి ప్రతిపక్ష పార్టీలు దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అధికార లెఫ్ట్ కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ వర్గాన్ని కించపరిచేలా ఈ పాట, డ్యాన్స్ స్కిట్ ఉందని ఆరోపిస్తున్నారు. దీంతో సీఎం పినరయి విజయన్ సర్కార్ దీనిపై విచారణకు ఆదేశించింది. ఇటీవల కోజికోడ్ లో జరిగిన యూత్ ఫెస్టివల్ స్వాగత గీతం, డ్యాన్స్ స్కిట్ లో భాగంగా దేశభక్తి, లౌకికవాదం, ఐక్యత, బలగాల పోరాట స్ఫూర్తిని వర్ణించే విధంగా ఓ సాంగ్ పై ప్రదర్శన ఇచ్చారు. ఇందులో భారత ఆర్మీ జవాన్ ఓ చొరబాటుదారుడిని పట్టుకుంటాడు. అయితే చొరబాటుదారుడు సంప్రదాయ ముస్లిం దుస్తులు ధరించి ఉండటంతో వివాదం రాజుకుంది.
Read Also: RRR Movie: ‘నాటు నాటు’ సాంగ్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి మాట్లాడుతూ.. దీనిపై విచారణ జరిపి వారంలోగా నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ని ఆదేశించినట్లు వెల్లడించారు. కోజికోడ్లోని మాత కళా కేంద్రం అనే స్కిట్ నిర్వాహకులను విద్యాశాఖ అన్ని కార్యక్రమాాల నుంచి నిషేధిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ మిత్రపక్షం అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మొదట ఈ అంశాన్ని లేవనెత్తింది. చొరబాటు ఉగ్రవాదికి ముస్లింల సంప్రదాయ దుస్తులు ఉండటం విచారకరం అని.. ఇది తప్పుడు సంకేతాన్ని ఇస్తుందని పార్టీ నేత పికె కున్హాలికుట్టి అన్నారు.
దేశంలో నిర్థిష్ట వర్గాన్ని తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని.. సంఘ్ పరివార్ భావజాలాన్ని చొప్పించడానికి ప్రయత్నిస్తున్నారంటూ సీపీఎం ఆరోపిస్తోంది. జనవరి 3-7 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. లెఫ్ట్ ప్రభుత్వం ఇలాంటివి చేయడంలో ఆర్ఎస్ఎస్ ను మించిపోయిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఉగ్రవాదికి దేశభక్తి ముసుగు వేయాలని కాంగ్రెస్, సీపీఎం, ముస్లిం లీగ్ కోరుకుంటున్నాయని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!