Home
Cm Pinarayi Vijayan
Cm Pinarayi Vijayan News
-
Indian constitution: రాజ్యాంగంపై మంత్రి వివాదాస్పద కామెంట్లు.. వివరణ కోరిన గవర్నర్, సీఎం..
కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనమతించదని.. కానీ, వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందని కేరళ మంత్రి విమర్శించారు. దీని కారణంగానే కార్పొరేట్ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు. -
Kerala Gold Scam: మరో కొత్త ట్విస్ట్.. స్కామ్లో సీఎం పాత్ర?
2020 జులైలో వెలుగుచూసిన కేరళ గోల్డ్ స్కామ్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేశ్.. ఇప్పటికే 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించింది. గతేడాది నవంబర్ నెలలో ఆమె బయటకొచ్చింది. అప్పట్నుంచి ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఆమె ఈ స్కామ్లో కేరళ సీఎం పినరయి విజయన్ హస్తం ఉందంటూ స్వప్న సురేశ్ బాంబ్ పేల్చింది. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఈమె కోర్టులో… -
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చొద్దు.. కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. కొన్ని సవరణలను ప్రతిపాదించింది.. కానీ, అప్పుడే రాష్ట్రాలు.. కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నాయి.. తాజాగా, ఈ జాబితాలో మరో రెండు రాష్ట్రాలు చేరాయి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరాయి విజయన్.. కేంద్రం ప్రతిపాదనలపై తమ లేఖలో ఇద్దరు సీఎంలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే కేంద్రం ప్రతిపాదనలను పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్… -
మరోసారి తెరపైకి హీరోయిన్ లైంగిక వేధింపుల కేసు.. సీఎంకి లేఖ
చిత్ర పరిశ్రమలో వివాదాలకు కొదువ లేదు.. ఆ హీరో తనను లైంగికంగా వేధించాడని, దర్శక నిర్మాతలు తనను బెదిరిస్తున్నారని ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఐదేళ్ల క్రితం సౌత్ హీరోయిన్ ఒకామెను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొంతమంది వ్యక్తులు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసులో ఎనిమిది మంది దోషులను పట్టుకున్న పోలీసులు వారందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది.… -
యూట్యూబర్తో సన్నిహిత సంబంధాలు.. ఐజీపై సస్పెన్షన్ వేటు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఐపీఎస్ అధికారిపై వేటు వేసింది కేరళ ప్రభుత్వం… కేరళ కేడర్కు ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మణ్ నాయక్ను సస్పెండ్ చేశారు సీఎం విజయన్.. నకిలీ పురాతన కళాఖండాలను విక్రయించిన కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ మోన్సన్ మవున్కల్తో లక్ష్మణ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలడంతో.. కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.. గతంలోనూ లక్ష్మణ్ నాయక్పై పలు ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు పోలీసులు. ఇక, 1997 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి… -
కేరళకు కరోనా అత్యవసర ప్యాకేజీ..
కరోనా సెకండ్ వేవ్ కేసులు అన్ని రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతూ వస్తున్నా.. కేరళలో మాత్రం ఇంకా పెద్ద సంఖ్యలోనే పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి.. దీనికి పెద్ద సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా కారణంగా చెబుతున్నారు.. అయితే, కరోనా అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ 2 కింద కేరళ రాష్ట్రానికి రూ.267.35 కోట్ల నిధులు కేటాయించినట్లు ఇవాళ ప్రకటించారు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా.. ఇవాళ తిరువనంతపురం వెళ్లిన మాన్సుఖ్ మాండవియా.. ఆ రాష్ట్ర… -
కేరళలో మరో వివాదం: సీఎంను భగవంతునితో పోలుస్తూ…
కేరళలో ఇటీవలే వలన్చెరిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎన్నికల్లో విజయం తరువాత పినరయి విజయన్ వర్గం ఓ పెద్ద హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. విష్ణు ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన హోర్డింగులో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. పినరయి విజయన్ను భగవంతునితో పోలుస్తూ హోర్డింగులు ఏర్పాటు చేశారు. పినరయి విజయన్ ఫోటోతో పాటుగా కింద భగవంతుడు ఎవరని మీరు ప్రశ్నిస్తే ఆహారం అందించేవారని చెబుతారు అని రాసి ఉన్నది. దీనిపై ఎల్డీఎఫ్ స్పందించింది.… -
మళ్లీ 20 వేల కోట్లతో కేరళ కోవిడ్ ప్యాకేజీ
కరోనా కట్టడి చర్యల్లో అందరి ప్రశంసలు అందుకుంది కేరళ ప్రభుత్వం.. గత ఏడాది కోవిడ్ కట్టడి కోసం రూ.20 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం.. తాజాగా ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి.. మళ్లీ అధికారంలోకి వచ్చింది ఎన్డీఎఫ్ ప్రభుత్వం.. దీంతో.. మరోసారి కేరళ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు పినరయి విజయన్.. కేబినెట్ లో మొత్తం కొత్తవారికే అవకాశం కల్పించారు.. ఇక, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ను ఆర్థిక… -
కేరళ సీఎంగా విజయన్ ప్రమాణస్వీకారం
కేరళలో ప్రతీ ఐదేళ్లకు ప్రభుత్వాలు మారే సాంప్రదాయానికి తెరదింపుతో.. వరుసగా రెండోసారి విజయం సాధించింది ఎల్డీఎఫ్… దీంతో.. కేరళ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు పినరయి విజయన్… ఆయన చేత గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం విజయన్తో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సమయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని.. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కోవిడ్ నిబంధనల మధ్య నిర్వహించారు.. సీపీఐ(ఎం) నేతలతో పాటు అతికొద్ది… -
అంతర్జాతీయంగా ప్రశంసలు.. కేకే శైలజకు కేరళ కేబినెట్లో దక్కని చోటు..!
భారత్లో కరోనా కట్టడిలో కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది.. దీని వెనుక సీఎం పినరయి విజయన్తో పాటు.. ఇప్పటి వరకు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కేకే శైలజ కృషి ఎంతో ఉంది.. దానికి తగ్గట్టుగానే ఆమెకు వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి, ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.. అరుదైన గౌరవాన్ని కల్పించాయి. అయితే, తాజాగా జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు శైలజా టీచర్.. మత్తన్నూర్ నియోజకవర్గం నుంచి…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!