మరోసారి మద్యం షాపుల లైసెన్స్ గడువు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం.. రెండో దశ కరోనా మహమ్మారి కారణంగా వైన్స్ షాపులు మూత పడటంతో లైసెన్స్లను నెల రోజుల పాటు పొడిగించింది ప్రభుత్వం. కరోనా కారణంగా మూతపడిన కారణంగా… బార్లు, వైన్స్ల లైసెన్సులను మరో నెల పాటు పొడిగించింది. అక్టోబర్ చివరినాటికి ముగియనున్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువును నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. ఈనెల ఆఖరు వరకు బార్ల లైసెన్సుల గడువు ముగియనుండగా.. నెలరోజుల పొడిగింపుతో అక్టోబర్…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… కేసీఆర్, మోడీ సర్కార్ లపై నిప్పులు చెరిగారు. ఇవాళ అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, మోడీ ఇద్దరూ తోడు దొంగలేనని… పెట్రోలు, డీజిల్ ధరలు అడ్డుగోలుగా పెరిగాయని నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ ఆస్తులు అమ్ముతున్నారని… నోట్ల రద్దు పేదల పాలిట విష ప్రయోగమన్నారు. మోదీ జాతి సంపదను ఆధాని, అంబానీలకు అమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. ఆధాని,…
కరోనా కష్టకాలంలో ప్రజలపై మరో పిడుగును వేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను సాకుగా చూపుతూ ఆర్టీసీ ఛార్జీలను.. డిస్కం నష్టాలను చూపుతూ విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనాతో ఇప్పటికే ప్రజలంతా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే పులిమీద పుట్రలా మరో భారాన్ని మోపడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండటం శోచనీయంగా మారింది. ఈ పెంపు త్వరలోనే అమల్లోకి రానుందని తెలుస్తోంది. కరోనా మహమ్మరి దెబ్బకు అన్నిరంగాల మాదిరిగానే ఆర్టీసీ సైతం కుదేలైంది.…
లిక్కర్ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కాసేపటి క్రితమే విడుదల చేశారు.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. మద్యం షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్.. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 17 (1 ) (V ) అనుసరించి ప్రభుత్వం ఏ- 4 రిటైల్…
తెలంగాణ, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ నీరుగార్చారు అని బండి సంజయ్ అన్నారు. పేదల ఆత్మ బలి దానాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. కరసేవకుల బలిదానాలతోనే అయోధ్యలో రామమందిరం వచ్చింది అన్నారు. కేసీఆర్ మూర్ఖపు విధానాలతో రైతులు చెరుకు సాగు మానేశారు అన్న ఆయన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని ఎందుకు మూసేశారో సమాధానం చెప్పాలి అన్నారు. వరిసాగు పై రైతులకు భరోసా కల్పించాలి. అలాగే మొక్క జొన్నలు కొనకపోతే కేసీఆర్ ఫామ్ హౌజ్…
ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని ఫైర్ అయిన మంత్రి కేటీఆర్.. ఇప్పటి వరకు అన్నీ ఓపికగా భరించాం.. ఇక, నోటికిఏదివస్తే అది మాట్లాడితే.. రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అయితే, దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలి అంటూ సవాల్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా.. తాడ్వాయిలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడతారా?…
సమైక్య రాష్ట్రంలో కులవృత్తుల నిరాదరణ తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ధ్వoసం అయ్యింది అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. మత్సకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతుంది. కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించేoదుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం…
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యం లో… తెలంగాణ మంత్రి కేటీఆర్ మరియు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. డ్రగ్స్ టెస్టు లకు నువ్వు సిద్దామా ? అంటే నువ్వు సిద్దామా ? అన్న రీతిలో ఇద్దరూ లీడర్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యం లో తాను డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. టెస్ట్ కోసం రాహుల్ గాంధీ వస్తే తాను…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఐక్యపోరాటాలు చేయాలని తెలంగాణ ప్రతిపక్షాలు నిర్ణయించాయి. గాంధీభవన్లో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఫోర్ పాయింట్ ఫార్ములాను ప్రకటించారు. పోడుభూములతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉమ్మడిగా కార్యక్రమాలు చేపడతామన్నారు నేతలు. తెలంగాణలో భూసమస్యలు, ధరణి వెబ్ సైట్ లోపాలపై సీరియస్ గా పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలిపాయి. గాంధీభవన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల…
త్వరలోనే హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరుగనుంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఎన్నిక మారింది. దీంతో ఎవరికీవారు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లురుతున్నారు. ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతుండగా టీఆర్ఎస్ నుంచి యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నాడు. కాంగ్రెస్ పోటీలో నిలిచినా అది రెండో, మూడో ప్లేస్ కోసమనే అర్థమవుతోంది. దీంతో పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యేనని స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్తేమీకాదు.…