ఆర్టీసీ, విద్యుత్ చార్జీలతో ప్రజలపై ఎంత భారం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కష్టకాలంలో ప్రజలపై మరో పిడుగును వేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను సాకుగా చూపుతూ ఆర్టీసీ ఛార్జీలను.. డిస్కం నష్టాలను చూపుతూ విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనాతో ఇప్పటికే ప్రజలంతా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే పులిమీద పుట్రలా మరో భారాన్ని మోపడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండటం శోచనీయంగా మారింది. ఈ పెంపు త్వరలోనే అమల్లోకి రానుందని తెలుస్తోంది.
కరోనా మహమ్మరి దెబ్బకు అన్నిరంగాల మాదిరిగానే ఆర్టీసీ సైతం కుదేలైంది. కరోనా సమయంలో చాలారోజులపాటు బస్సులు షెడ్డులకే పరిమితమయ్యాయి. బస్సుల రవాణా తిరిగి పునరుద్దరించినప్పటికీ కరోనా ఆంక్షల మధ్యే సాగాయి. ఈ కారణంగా ఆర్టీసీకి భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు పెరిగిన పెట్రోల్, డిజీల్ ధరలు సైతం ఆర్టీసీ మనుగడను ప్రశార్థకంగా మార్చివేశాయి. ఆర్టీసీ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఛార్జీల పెంపుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
ఇటీవల ఆర్టీసీకీ ఎండీగా నియామకమైన సజ్జనార్ సైతం ఛార్జీల పెంపు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం సూత్రపాయంగా అంగీకరించిందని సమాచారం. అయితే ఏమేరకు ప్రజలపై భారం మోపాలి? అనే విషయాన్ని క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపునకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనబడుతోంది. ఎప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచాలని డిస్కంలు పట్టుబడుతున్నాయి.
గడిచిన ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలను ప్రభుత్వం సవరించలేదని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. గత మార్చిలోనే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతామని హామీ ఇచ్చిందని అయితే కరోనా కారణంగా వాయిదా వేసిందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ సంస్థలు గట్టెక్కాలంటే చార్జీలను పెంచాల్సిందేనని అధికారులు పట్టుబడుతున్నారు. దీనిపై త్వరలోనే క్యాబినెట్లో చర్చించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ప్రస్తుతం హుజూరాబాద్ ఎన్నికల మూడ్ లో ఉంది. ఇక్కడ గెలుపును సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచితే అది ఖచ్చితంగా ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. దీంతో ప్రభుత్వం హుజూరాబాద్ ఎన్నికల తర్వాతే విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తోంది. ఏదిఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటికి విరుగుడు మంత్రంగా ప్రజలపై భారం మోపుతూ వెళుతుండటం మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే సామాన్యులపై భారం మోపుతుండటంతో వాళ్ల గోడు ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.
- Tags
- cm kcr
- power charges
- rtc
- telangana
- TSRTC
తాజావార్తలు
-
LIG Housing Scheme: లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు పెట్టండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి.!
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
Jayam Ravi : మరో వివాదంలో చిక్కుకున్న జయం రవి.
-
Bill Gates: “అవును, నాకు ఆ ముగ్గురితో ఎఫైర్ ఉంది”.. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణలో బిల్ గేట్స్ షాకింగ్ స్టేట్మెంట్
-
OnePlus 16T: వన్ప్లస్ 16T వచ్చేస్తోంది.. 6.3 ఇంచెస్ హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే.. స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్
ట్రెండింగ్
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!