ఐక్యపోరాటానికి సిద్దమైన తెలంగాణ ప్రతిపక్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఐక్యపోరాటాలు చేయాలని తెలంగాణ ప్రతిపక్షాలు నిర్ణయించాయి. గాంధీభవన్లో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఫోర్ పాయింట్ ఫార్ములాను ప్రకటించారు. పోడుభూములతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉమ్మడిగా కార్యక్రమాలు చేపడతామన్నారు నేతలు. తెలంగాణలో భూసమస్యలు, ధరణి వెబ్ సైట్ లోపాలపై సీరియస్ గా పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలిపాయి. గాంధీభవన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి పార్టీలు హాజరయ్యాయి.
ఈ నెల 22వ తేదీన ఇందిరా పార్కు వద్ద భూ సమస్యలపై మహా ధర్నా చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని రైతులకు పిలుపునిచ్చాయి. ఈ నెల 27 న భారత్ బంద్ ను ఉమ్మడిగా విజయవంతం చేస్తామని తెలిపాయి. ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రజలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్ లో పాల్గొనేలా ప్రణాళిక ఉంటుందని చెప్పాయి. ఈ నెల 30వ తేదీన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల కు వినతి పత్రాలు ఇస్తామన్నాయి.
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
అక్టోబర్ 5న పోడుభూముల సమస్యపై అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు రాస్తారోకో చేస్తామని ప్రకటించాయి. ప్రతిపక్షాల ఐక్య కార్యాచరణ ప్రకటన వెలువడగానే.. ప్రభుత్వ పోడుభూములపై మంత్రులతో సబ్ కమిటీ వేయడంపై ప్రతిపక్షాలు సెటైర్లు వేశాయి. కంటితుడుపు కమిటీలతో తమ పోరాటాలు ఆగబోవని స్పష్టం చేశాయి. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసంగా ఫోర్ పాయింట్ ఫార్ములాను ప్రకటించిన విపక్షాలు.. కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాయి.
- Tags
- bjp
- cm kcr
- revanth-reddy
- TRS
తాజావార్తలు
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!