ఐక్యపోరాటానికి సిద్దమైన తెలంగాణ ప్రతిపక్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఐక్యపోరాటాలు చేయాలని తెలంగాణ ప్రతిపక్షాలు నిర్ణయించాయి. గాంధీభవన్లో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఫోర్ పాయింట్ ఫార్ములాను ప్రకటించారు. పోడుభూములతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉమ్మడిగా కార్యక్రమాలు చేపడతామన్నారు నేతలు. తెలంగాణలో భూసమస్యలు, ధరణి వెబ్ సైట్ లోపాలపై సీరియస్ గా పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలిపాయి. గాంధీభవన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి పార్టీలు హాజరయ్యాయి.
ఈ నెల 22వ తేదీన ఇందిరా పార్కు వద్ద భూ సమస్యలపై మహా ధర్నా చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని రైతులకు పిలుపునిచ్చాయి. ఈ నెల 27 న భారత్ బంద్ ను ఉమ్మడిగా విజయవంతం చేస్తామని తెలిపాయి. ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రజలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్ లో పాల్గొనేలా ప్రణాళిక ఉంటుందని చెప్పాయి. ఈ నెల 30వ తేదీన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల కు వినతి పత్రాలు ఇస్తామన్నాయి.
Also Read
అక్టోబర్ 5న పోడుభూముల సమస్యపై అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు రాస్తారోకో చేస్తామని ప్రకటించాయి. ప్రతిపక్షాల ఐక్య కార్యాచరణ ప్రకటన వెలువడగానే.. ప్రభుత్వ పోడుభూములపై మంత్రులతో సబ్ కమిటీ వేయడంపై ప్రతిపక్షాలు సెటైర్లు వేశాయి. కంటితుడుపు కమిటీలతో తమ పోరాటాలు ఆగబోవని స్పష్టం చేశాయి. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసంగా ఫోర్ పాయింట్ ఫార్ములాను ప్రకటించిన విపక్షాలు.. కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాయి.
- Tags
- bjp
- cm kcr
- revanth-reddy
- TRS
తాజావార్తలు
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?