దేశంలో తాత్కాలిక ప్రయోజనాల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అది రాబోయే తరాలకు ప్రమాదకరం అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. పీపుల్స్ మార్చ్ పేరుతో ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేపట్టారు భట్టి విక్రమార్క. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక విషయాలు ప్రస్తావించారు. తనదైన రీతిలో సమాధానాలిచ్చారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం మోడీ ప్రయత్నించడం పట్ల లౌకికవాదులు కళ్ళు తెరవాలన్నారు. సీఎల్పీ నేతగా తాను రాష్ట్రమంతా యాత్రలు చేస్తా. పీసీసీ అధ్యక్షుడిగా…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోపోరాటానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.. కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న గులాబీ బాస్కు ఇప్పుడో మరో అస్త్రం దొరికినట్టు అయ్యింది.. వరి కొనుగోళ్లు, విద్యుత్ మీటర్లు, కేంద్రం వైఫల్యాలు ఇలా అనేక అంశాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు కేసీఆర్.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన విషయం తెలిసిందే.. అయితే, ఇప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన…
అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో .. రైల్వే పోలీస్ కాల్పుల్లో, వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం ఓ యువకుడి ప్రాణాలను బలిగొందని గ్రామస్తులు విమర్శించారు. కేంద్రం తప్పుడు విధానాలవల్లే రాకేష్ బలయ్యాడని మండిపడ్డారు. రాకేష్…
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూల చర్యలు చేపట్టాలి. విద్యార్థులు ఆందోళన విరమించే దిశగా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్. ట్రిపుల్ ఐటీలను ఏ లక్ష్యం కోసం స్థాపించారో అది నెరవేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని పవన్ కోరారు. గత కొద్దిరోజులుగా…
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లిలోని రైతు వేదిక భవనాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టుని కాంగ్రెస్ పార్టీ ఒక టీఎంసీ కోసం ఆలోచించిందని, ఇప్పుడు మనం 8.23 టీఎంసీలుగా మార్చామని ఆయన వెల్లడించారు. భూ నిర్వాసితులకు 98 శాతం పరిహారం అందించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి,…
మహిళల భద్రతపై, సమస్యలపై రోశయ్య హాయాంలో సమావేశం జరిగిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్లలో ఒక్కసారి కూడా సమావేశం పెట్టలేదని విమర్శించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. ప్రతిపక్ష నాయకులు ప్రగతి భవన్ కు ఎలా వచ్చారని సమీక్ష చేసుకుంటారు కానీ.. తెలంగాణలో మహిళలపై దాడి చేస్తే సమీక్ష ఎందుకు చేయరని ప్రశ్నించారు. సీఎంకు తన భద్రత మీద ఉన్న శ్రద్ధ.. మహిళల భద్రతపై లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆయన గురించే ఆలోచిస్తున్నారు..ఆయన గురించే…
దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఎజెండా కోసం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని జాతీయ పార్టీలు వైఫల్యం చెందాయని విమర్శించారు. దేశ అభివృద్ధిలో ఏ ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకమైన పద్దతిలో పని చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా విఫలమైందని ఆరోపించారు. అందుకే కేసీఆర్ కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన మొదటి నుండి అవకాశాలు పొందిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ…
రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు… కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. తాము నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని.. కాంగ్రెస్, దాని మిత్రాలను కోరనుంది బీజేపీ. ఇందులో భాగంగా విపక్షాలతో చర్చల జరిపే బాధ్యతను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అప్పగించింది. విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టకుండా.. తాము నిలిపే అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమయ్యాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థిని…
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాహితులపై కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జిని ఆయన ఖండించారు. అర్ధరాత్రి సమయంలో గుడాటిపల్లికి వెళ్లి బాధిత నిర్వాసితులను పరామర్శించారు బండి సంజయ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులపై మరోసారి లాఠీఛార్జ్ జరిగింది. హుస్నాబాద్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు భూ నిర్వాసితులు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. హుస్నాబాద్ బస్టాండ్ దగ్గర్లో ధర్నాకు…
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇవాళ్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.. మరోసారి ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీ వేదికగా కీలక సమావేవాన్ని ఏర్పాటు చేశారు.. బీజేపీయేతర పక్షాలకు చెందిన 20 మందికి పైగా నేతలకు…