Former MP Vinod Kumar : అప్పు చేసి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లిలోని రైతు వేదిక భవనాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టుని కాంగ్రెస్ పార్టీ ఒక టీఎంసీ కోసం ఆలోచించిందని, ఇప్పుడు మనం 8.23 టీఎంసీలుగా మార్చామని ఆయన వెల్లడించారు. భూ నిర్వాసితులకు 98 శాతం పరిహారం అందించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ అప్పు చేశాడు అని ఆరోపిస్తున్నారని, అప్పుచేసి కరెంటు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టామని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
విపక్షాలు ఉన్నత పాత్ర పోషించకుండ.. రాజకీయ లబ్ది కోసం పాటుపడుతున్నాయని ఆయన విమర్శించారు. వరి కొనుగోలులో కూడా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ ఇతర రాష్ట్రాల్లో లేవని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, కేసీఆర్ ఆలోచన భావితరాల భవిష్యత్తుకు పునాది అని ఆయన అన్నారు.
Also Read
తాజావార్తలు
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!