ఇటీవల పలువురి ఉపాధ్యాయుల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. వారి ప్రవర్తనతో ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెస్తున్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన వారు వక్రమార్గాన్ని అనుసరిస్తున్నారు. దేవాలయాలుగా భావించే పాఠశాలలు, కళాశాలల్లో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు క్షణికావేశంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు విద్యార్థుల ముందే తన్నుకుంటున్నారు. ఇదే రీతిలో ప్రభుత్వ టీచర్లు జుట్లు పట్టుకుని పొట్టుపొట్టు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also Read:Samantha : సమంతకు స్టేజ్ పైనే…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎలోన్ మస్క్-విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియా మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు తొలగింపుపై ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఎలోన్ మస్క్.. వ్యంగ్యంగా మాట్లాడడంతో ఘర్ఫణ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్లోని గాంధీభవన్లో గొడవ జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కొత్తగూడెం నేతలకు పోస్టులు ఇవ్వడంపై స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు.మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. ఇళ్లను పడగొట్టడం, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. గర్భిణీ స్త్రీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు - ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ మూకలు దాడి చేయడం పట్ల బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది కార్యకర్తలొచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే.. గాంధీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటోందా? పిల్లలు, వృద్ధులకు రాళ్లు తగిలితే…
బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళు విసిరారు. బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకొని బయటకు వచ్చారు. బీజేపీ కార్యాలయం లోపలికి రాళ్ళు విసరడంతో ఒక దళిత మోర్చా కార్యకర్త తలకి గాయాలయ్యాయి. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక్కడ…
నందలూరు మండల కేంద్రంలో కిక్రెట్ ఆడుతుండగా.. యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఇది చిలికిచిలికి గాలివానగా మారిపోయింది.. ఈ ఘర్షణలో వికెట్లతో కరిముల్లా అనే కువకుడిపై దాడి చేశారు 11 మంది యువకులు.. అతడిని చితకబాదారు.. కరిముల్లాకు తీవ్ర గాయాలు కావడంతో.. 108 వాహనంలో కడప రిమ్స్ కి తరలించారు..
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిలకు తరలివచ్చిన క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తు బోధనలను క్రైస్తవ మతపెద్దలు వివరించారు. కాగా.. మరోవైపు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా, క్రిస్మస్, శాంటా క్లాజ్ కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
గుంటూరు జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది.. స్కూల్ లో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంతో ఓ బాలుడి హత్యకు దారి తీసింది.. తాడికొండ మండలం పొన్నెకల్లులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.. విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంతో తోటి విద్యార్థిని కొట్టి చంపి బావిలో పడేశారు సహచర విద్యార్థులు.. ఈ ఘటనతో తీవ్ర విషయంలోకి వెళ్లిపోయింది సదరు విద్యార్థి కుటుంబం.. గత నెల 24వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన…
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గత రాత్రి కన్నుమూశారు. కానీ ఆయన భారతీయుల మదిలో ఎప్పటికీ బతికే ఉంటారు. టాటా సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లి ఉన్నత శిఖరాలకు చేర్చిన ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు.