చిత్తూరులో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా డీడీవో కార్యాలయాలను ప్రారంభించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో 77 డీడీవో ఆఫీసులను ప్రారంభించాం అని, విస్తృతంగా ప్రజలకు సేవలందించడానికి డీడీవో ఆఫీసులు ఉపయోగపడుతాయన్నారు. సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడానికి ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయి పవన్ కళ్యాణ్ చెప్పారు. చిత్తూరు…
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. మరికాసేపట్లో ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా మామండూరు అటవి ప్రాంతానికి వెళ్లి, ఎర్రచందనం గోడౌన్లను పరిశీలిస్తారు. తర్వాత మంగళంలో ఉన్న ఎర్రచందనం నిల్వ గోదాములను సందర్శించనున్న పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం కలెక్టరేట్లో అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. నిల్వలో ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించనున్నారు.…
Kurnool Bus Fire Accident: కర్నూలు నగర సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్ బస్ ఫైర్ యాక్సిడెంట్ లో 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే 18 మంది ప్రయాణికుల మృతదేహాలు సంబంధించిన వివరాలను పోలీసులు కనుగొన్నారు. కాకపోతే మరో మృతదేహానికి సంబంధించిన వివరాలను పోలీసులు చేదించలేకపోయారు. అయితే తాజాగా ఈ డెడ్ బాడీకి సంబంధించిన వివరాలను పోలీసులు ప్రకటించారు. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిదంటే.. Viral Video: మందు…
Chittoor Mayor Couple Murder Case: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో A1 నుంచి A5 వరకు ఉన్న ముద్దాయిలపై హత్యా యత్నం నేరం రుజువైందని కోర్టు పేర్కొంది. వారికి అక్టోబర్ 27వ తేదీ వరకు న్యాయస్థాన జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అలాగే, A6 నుంచి A23 వరకు ఉన్న ముద్దాయిలపై న్యాయస్థానం కేసును కొట్టివేసింది. వారికి సంబంధించిన బెయిల్ బాండ్ ఆరు నెలల పాటు అమల్లో…
Mayor Couple Murder Case: నేడు చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో తుది తీర్పు వెలువరించనుంది కోర్టు.. నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో కటారి దంపతులు హత్యకు గురయ్యారు.. పదేళ్ల తర్వాత తీర్పు వెలువడనుండడంతో తీర్పుపై అంతటా ఉత్కంఠ నెలకొంది.. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టు వద్ద చిత్తూరులో భారీ భద్రత, 30 యాక్ట్ అమలు చేస్తున్నారు పోలీసులు.. దివంగత మేయర్ దంపతులు కఠారి అనురాధ మోహన్ దంపతుల హత్య కేసు తుది తీర్పు…
బెట్టింగ్ యాప్స్పై తెలంగాణ సీఐడీ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. ఏకకాలంలో 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మంది బెట్టింగ్ యాప్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారులు ఉన్నారనే విషయాన్ని గమనించిన సీఐడీ వారికోసం వేట సాగిస్తోంది. మరోవైపు చిత్తూరు జిల్లాలో కేవలం ఇంటర్ చదివి ఓ యువకుడు బెట్టింగ్ యాప్ రూపొందించాడు. కోట్లకు పడగలెత్తాడు. కానీ చివరికి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతను బెట్టింగ్ యాప్స్…
కుప్పం వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ అడుగుపెట్టింది. హంద్రీ - నీవా ప్రాజెక్టులో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ గుండా కృష్ణా జిల్లాలు కుప్పంలో అడుగుపెట్టాయి. పరమ సముద్రం అనే గ్రామం వద్ద నుంచి కృష్ణా జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశించాయి. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పంకు వెళ్లి పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు హారతులు పట్టి స్వాగతం పలకనున్నారు. తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన కృష్ణా జలాలకు సీఎం ప్రత్యేక పూజలు…