Mayor Couple Murder Case: చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో నేడు తుది తీర్పు.. 30 యాక్ట్ అమలు..
- నేడు చిత్తూరు మాజీ మేయర్ హత్య కేసులో తుది తీర్పు..
- నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో కటారి దంపతుల హత్య..
- పదేళ్ల తరువాత వెలువడనున్న తీర్పు.. అంతటా ఉత్కంఠ..
- జిల్లా కోర్టు వద్ద చిత్తూరులో భారీ భద్రత, 30 యాక్ట్ అమలు..
Mayor Couple Murder Case: నేడు చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో తుది తీర్పు వెలువరించనుంది కోర్టు.. నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో కటారి దంపతులు హత్యకు గురయ్యారు.. పదేళ్ల తర్వాత తీర్పు వెలువడనుండడంతో తీర్పుపై అంతటా ఉత్కంఠ నెలకొంది.. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టు వద్ద చిత్తూరులో భారీ భద్రత, 30 యాక్ట్ అమలు చేస్తున్నారు పోలీసులు.. దివంగత మేయర్ దంపతులు కఠారి అనురాధ మోహన్ దంపతుల హత్య కేసు తుది తీర్పు వెలువరించనుంది ప్రత్యేక కోర్టు.. కాగా, 2015 నవంబర్ 15వ తేదీన చిత్తూరు మునిసిపల్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.. మునిసిపల్ కార్యాలయంలోని ఛైర్మెన్ కార్యాలయంలో ఛైర్మెన్ శ్రీమతి అనురాధ , మోహన్ లను తుపాకీలతో కాల్చి, కత్తులతో నరికి చంపారు దుండగులు.. ఈ హత్యకు సంబంధించి మొత్తం 23 మంది నిందితులను చేర్చుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు.. ప్రస్తుతం నిందితులలో కాళహస్తికి చెందిన నిందితుడు కావటం రమేష్ స్క్వాష్ పిటీషన్ ద్వారా కేసునుంచి తొలగించారు.. మరో నిందితుడు మృతి చెందాడు.. ఈ కేసులో 163 మంది సాక్షులను విచారించిన కోర్టు.. ఈ రోజు తుది తీర్పు వెలువరించనుంది.. ఈ నేపథ్యంలోనే కోర్టు పరిసరాలు, చిత్తూరులో ఎలాంటి అల్లర్లు, సంబరాలు జరగకుండా నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు..
Read Also: Kurnool Road Accident: కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. సీఎం, మాజీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
Also Read
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
- Young Man D*ied with Heart Attack in Gym: జిమ్లో గుండెపోటుతో యువకుడు మృతి..
చిత్తూరులోని ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఈ కేసులో నేడు తీర్పు వెలువరించనుంది. దీంతో పదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. కోర్టు ఆవరణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా బాంబు స్క్వాడ్, స్పెషల్ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే కోర్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంపై పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక చిత్తూరు నగరంలో కూడా ఎక్కడా ఎలాంటి శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అనురాధ, మోహన్ జంట హత్యల కేసులో తొలుత 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శ్రీకాళహస్తికి చెందిన కాసారం రమేష్ అనే వ్యక్తికి ఈ కేసులో సంబంధంలేదని న్యాయస్థానం గతంలో తీర్పునిచ్చింది. ఇక మరో నిందితుడు శ్రీనివాస ఆచారి అనారోగ్యంతో కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. దీంతో నిందితులు 21 మందిగా మిగిలారు.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!