Chittoor Mayor Couple Murder Case: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కీలక తీర్పు..
- చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు కీలక తీర్పు..
- A1 నుంచి A5 వరకు ఉన్న ముద్దాయిలపై హత్యా యత్నం నేరం రుజువైంది..
- వారికి 27వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించిన కోర్టు..
- A6 నుంచి A23 వరకు ఉన్న ముద్దాయిలపై కేసు కొట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor Mayor Couple Murder Case: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో A1 నుంచి A5 వరకు ఉన్న ముద్దాయిలపై హత్యా యత్నం నేరం రుజువైందని కోర్టు పేర్కొంది. వారికి అక్టోబర్ 27వ తేదీ వరకు న్యాయస్థాన జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అలాగే, A6 నుంచి A23 వరకు ఉన్న ముద్దాయిలపై న్యాయస్థానం కేసును కొట్టివేసింది. వారికి సంబంధించిన బెయిల్ బాండ్ ఆరు నెలల పాటు అమల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇక, 2015 నవంబర్ 15న మాజీ మేయర్ దంపతులు కటారి అనురాధ, కటారి మోహన్ హత్య కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.. తన అత్తమామలను దారుణంగా హత్య చేశారని తెలిపారు. న్యాయం గెలిచిందని ఆమె అన్నారు. ఈ నెల 27వ తేదీన కోర్టు శిక్ష ఖరారు చేయనున్నట్లు వివరించారు హేమలత..
Read Also: Kurnool Bus Accident: డ్రైవర్ అలా చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు.. బాధితుడి ఆవేదన..
Also Read
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
కాగా, 2015 నవంబర్ 15వ తేదీన చిత్తూరు మునిసిపల్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.. మునిసిపల్ కార్యాలయంలోని ఛైర్మన్ కార్యాలయంలో ఛైర్మన్ శ్రీమతి అనురాధ , మోహన్ లను తుపాకీలతో కాల్చి, కత్తులతో నరికి చంపారు దుండగులు.. అనురాధ, మోహన్ జంట హత్యల కేసులో తొలుత 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శ్రీకాళహస్తికి చెందిన కాసారం రమేష్ అనే వ్యక్తికి ఈ కేసులో సంబంధంలేదని న్యాయస్థానం గతంలో తీర్పునిచ్చింది. ఇక మరో నిందితుడు శ్రీనివాస ఆచారి అనారోగ్యంతో కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. దీంతో నిందితులు 21 మందిగా మిగిలారు. ఈ కేసులో 163 మంది సాక్షులను విచారించిన కోర్టు.. ఈ రోజు తుది తీర్పు వెలువరించింది కోర్టు..
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!