ఆ డైరెక్టర్ చేసింది రెండు సినిమాలు. రెండూ హిట్స్. దీంతో తంతే బూరెల బుట్టలో పడ్డట్టు మెగా ఛాన్స్ పట్టేశాడు. ఆ దర్శకుడే వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తొలి చిత్రంగా ‘ఛలో’ తీసి సక్సెస్ కొట్టిన వెంకీ ఆ తర్వాత నితిన్ తో ‘భీష్మ’ రూపొందించి మరో హిట్ కొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే మెగాఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం…
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ పెళ్లి నేడు హైదరాబాద్లో వైభవంగా జరిగింది. కార్తికేయ లోహితా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. వధూవరులిద్దరినీ చిరు ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆయన అయ్యప దీక్షలో ఉన్నందున, అతను పూర్తిగా నలుపు రంగు దుస్తులలో కనిపించాడు. ఇక వరుడు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు. పెళ్లికూతురు కూడా…
టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. నిన్న ఆయన ఆరోగ్యానికి సంబంధించి అపోలో ఆస్పత్రి నుంచి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో కైకాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి కైకాల అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా కైకాల త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కైకాల ఆరోగ్యానికి సంబంధించి ట్వీట్ చేశారు. అందులో…
ఆధ్యాత్మిక నగరం తిరుమల, తిరుపతిలో జలప్రళయం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలిచివేస్తున్నాయి. ప్రభుత్వం, టీటీడీ సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని కోరుతున్నా. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూత ఇవ్వాలని కోరుతున్నా’ అంటూ ట్విట్టర్లో చిరంజీవి పోస్ట్ చేశారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం…
లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో #HBDNayanatara అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. నయన్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ “గాడ్ ఫాదర్” మేకర్స్ నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. Read Also : ‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో…
హైదరాబాద్లో యోధా లైఫ్లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభమైంది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవిలు ప్రారంభించారు. వైద్యరంగంలో అనేక పెనుమార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరంలో వైద్యం అందుబాటులోకి వస్తోందని మెగస్టార్ చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీనోమ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. జీన్స్ ను ఆధారంగా చేసుకొని మనిషికి వచ్చే జబ్బులను ముందుగానే తెలుసుకోవచ్చని అన్నారు. కరోనా సమయంలో జీనోమ్…
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు మానేసి మంచి పని చేశారని… రాజకీయాలు మాట్లాడే భాష అస్సలు బాగోలేదని..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ అజారుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి పదవి వల్ల కొంచం తొందరగా పడుకుంటున్నానని..…
హైదరాబాద్ అమీర్ పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తవుతుంది. Read Also: విమాన ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రి..…
నాలుగు సంవత్సరాలు ఒకే సినిమాతో ప్రయాణం సాగించాలంటే కష్టమైన పనే. అదీ వరుస హిట్స్ ఇస్తూ ఊపుమీద ఉన్న దర్శకుడికి మరింత కష్టం. కానీ కొరటాలకు తప్పలేదు. 2018లో ‘భరత్ అను నేను’ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా కమిట్ అయి చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభించడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నప్పటికీ వీలయినంత ఫాస్ట్ గా పూర్తి చేశాడు. అయినా కరోనా కారణంగా రిలీజ్ లేట్…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన చిరు ప్రస్తుతం ‘గాడ్ఫాదర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఎవరు కనిపించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒరిజనల్ వెర్షన్ లో మోహన్ లాల్ చెల్లెలిగా మంజు వారియర్…