భారత్లో స్మార్ట్ఫోన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిమాండ్కు అనుగుణంగానే కొత్తకొత్త బ్రాండ్లు, మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రతినెలా పదుల సంఖ్యలో మొబైల్ మోడల్స్ దర్శనమిస్తున్నాయి. ఇక చౌకైన డేటా ఆఫర్లు, అందుబాటు ధరల్లో ఫోన్లతో దేశంలో స్మార్ట్ఫోన్ వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా మనదేశంలో స్మార్ట్ఫోన్లు వాడేవారి సంఖ్య జెట్ స్పీడ్ తో దూసుకువెళ్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యాపారాలు ఎక్కువ అవ్వడం, విద్యార్థుల ఆన్లైన్ క్లాసులతో మొబైల్స్ అమ్మకాలు మరింత ఎక్కువ…
ఆసియాలో అన్ని దేశాలపై ఆదిపత్యం సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ సముద్రంలోని పరాసెల్ దీవులు పరిధిలో ఉన్న సముద్ర జలాలు తమవే అంటే తమవే అని చైనా, వియాత్నం, తైవాన్లు వాదిస్తున్నాయి. ఇందులో బలం, బలగం అధికంగా ఉన్న చైనా ఈ జలాలపై ఆదిపత్యం చెలాయిస్తున్నది. 2016, జులై 12 వ తేదీన అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది. ఈ…
ఆఫ్ఘన్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘన్లోని అనేక ప్రాంతాలను తమ స్వాదీనంలోకి తీసుకున్న తాలిబన్లు కాందహార్ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆఫ్ఘన్లో ఉన్న 210 చైనీయులను చైనా గతవారం వెనక్కి తీసుకెళ్లింది. ఆఫ్ఘన్ అంతర్గత ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేసిన నేసథ్యంలో తాలిబన్లు కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా దేశం ఆఫ్ఘనిస్తాన్కు మిత్రదేశంగా భావిస్తున్నామని, షిన్జీయాంగ్ ప్రావిన్స్లో వేర్పాటువాద ఉఘర్ ముస్లీంలకు తాము మద్ధతు ఇవ్వబోమని తాలిబన్లు చైనాకు హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో…
డ్రాగన్ కంట్రీ చైనా కొత్త ఎత్తులు వేస్తోంది. సరిహద్దుల్లో కుయుక్తులు పన్నుతోంది. భారత్పై పైచేయి సాధించేందుకు టిబెటన్లను రంగంలోకి దించుతోంది. మన దగ్గర ఉన్న ఎస్ఎఫ్ఎఫ్ బలగాల తరహాలోనే టిబెటన్లతో ప్రత్యేక దళాలను సిద్ధం చేస్తోంది. కుయుక్తులు.. దొంగ దెబ్బలు..! చైనాకు ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య..! లద్దాఖ్లో ఉద్రిక్తతల తర్వాత డ్రాగన్.. ఇలాంటి వాటికి మరింత పదునుపెట్టింది డ్రాగన్. ఎల్ఏసీ ఉద్రిక్తతల సమయంలో భారత ప్రత్యేక దళాలు.. వ్యూహాత్మకంగా కదిలాయి. ఎస్ఎఫ్ఎఫ్.. ప్రత్యేక సాయుధ బలగాలు..…
చైనా ప్రతి దేశంలో కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి అపవాదును తొలగించుకునేందుకు, ఆ విషయాలను పక్కదోవ పట్టించేందుకు చైనా ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. సరిహద్దుల్లో ఉన్నదేశాలతో నిత్యం పేచీ పెట్టుకుంటున్న డ్రాగన్, తైవాన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీంగా టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్ ను తన గుప్పిట్లో పెట్టుకున్న చైనా, తైవాన్ దేశాన్ని కూడా తన ఆదీనంలోకి తీసుకుంటానని అంటోంది. టిబెట్ విషయంలో కూడా ఇదే దూకుడును ప్రదర్శించి…
ప్రచ్చన్న యుద్ధం తరువాత రష్యా ప్రభావం తగ్గిపోవడంతో చైనా బలం పుంజుకుంది. ఆర్ధికంగా, రక్షణ పరంగా బలం పెంచుకుంది. ఒకప్పుడు ఆయుధాలపై ఇతర దేశాలపై ఆధారపడిన డ్రాగన్ ఇప్పుడు ఇతర దేశాలకు ఆయుధాలు సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. గత కొంతకాలంగా చైనా అనుసరిస్తున్న విధానం, దూకుడు, సరిహద్దు దేశాలతో వివాదాలు కలిగి ఉండతటం, కరోనా మహమ్మారికి చైనానే కారణమని అగ్రదేశం అమెరికాతో సహా వివిధ దేశాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం చైనా రక్షణ…
చైనా కమ్యూనిస్టుపార్టీ శతవార్షికోత్సవ వేడుకలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈనాటి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాన్ని ఒక పార్టీ వందేళ్లపాటు నడిపించడం, సోవియట్ యూనియన్ విచ్చిన్నమైన తర్వాత కూడా సోషలిస్టు విధానం తమదంటూ కమ్యూనిస్టుల నాయకత్వంలో అమెరికాకు దీటుగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థితిలో వుండటం చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రత్యేకత. ఆసియాలో అత్యంత ప్రాచీన చరిత్ర, నాగరికతగల దేశం చైనా. అసమర్ధ చక్రవర్తుల పాలనలో విదేశీ శక్తులు తిష్టవేశాయి. అది స్థానిక యుద్ధ ప్రభావాల ఘర్షణలకు రంగస్థలమైంది.…
చైనాలో కమ్యునిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తైన సందర్బంగా బీజింగ్లోని తీయాన్మెన్ స్క్వేర్లో భారీ సభను నిర్వహించారు. ఈ సభకు 70 వేలమంది చైనీయులు హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి చైనా అధ్యక్షుడు జీజిన్పింగ్ ప్రసంగించారు. ప్రపంచంలో చైనా ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించిందని, చైనాను ఇప్పుడు ఎవరూ వేధించినా వారి సంగతి చూస్తామని జిన్పింగ్ తెలిపారు. తైవాన్ విషయంలో తమ నిర్ణయం ఎప్పటికీ ఒకేలా ఉంటుందని, తైవాన్ను విలీనం చేసుకొని తీరతామని జిన్పింగ్ పేర్కొన్నారు. Read:…
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా అతలాకుతలం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి కారణంగా కోట్లాదిమంది జీవనం అస్తవ్యస్తం అయింది. లక్షలాదిమంది మృతి చెందారు. ఈ మహమ్మారికి ప్రధాన కారణం ఎవరు అంటే ఠక్కున వచ్చే సమాధానం చైనా. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చినట్టు ఇప్పటికే నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. అయితే, కరోనా వైరస్ను జీనోమ్ చేసిన, మహమ్మారిపై విసృత పరిశోధనలు చేసినందుకు వూహాన్లోని వైరాలజీ ల్యాబ్ కు…
గత దశాబ్ధకాలంగా చైనా దూకుడును ప్రదర్శిస్తొంది. అమెరికా, రష్యా మధ్య ప్రచ్చన్న యుద్దం తరువాత రష్యా బలం కాస్త తగ్గగా, చైనా దూకుడును ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇది అమెరికాతో పాటుగా, ప్రపంచానికి కూడా పెద్ద ప్రమాదంగా మారింది. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులు తక్కువ ధరకే విదేశాలకు ఎగుమతి అవుతుండటంతో పాటుగా, ఇప్పుడు చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచానికి వ్యాపించడంతో అన్ని దేశాలు గుర్రున ఉన్నాయి. చైనాపై కోపం ఉన్నప్పటికీ, ఆ దేశంతో ఉన్న ఆర్థిక…