Kodali Nani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డాడని జగన్పై చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మకుండా అధికారాన్ని కట్టబెట్టారని.. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే పప్పు నాయుడు చంద్రబాబు అని కొడాలి నాని ఆరోపించారు. అటు పప్పు నాయుడు కుమారుడు తుప్పు నాయుడు మంగళవారం మాటలు మాట్లాడుతున్నాడని.. వారంలో ఏదో జగన్ వ్యవహారం బయటపెడతానని వాగుతున్నాడని.. అదేదో మొన్న…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్పై మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాడు అమరావతి గ్రాఫిక్స్ సృష్టించారు.. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై గ్రాఫిక్స్ చేయిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్పై ఆయన స్పందిస్తూ… నాలుగు రోజుల్లో నిజాలు బయటకు వస్తాయి.. గ్రాఫిక్స్ చేసింది ఎవరో బయటపడుతుందన్నారు.. ఇక, ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని…
బాడీ లాస్ కోసం ప్రయత్నిస్తే మైండ్ లాస్ అయినట్టుంది అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లోకేష్ చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడు.. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉన్న పరిశ్రమలు ప్రారంభించటానికి తన తండ్రికి టైం ఉండేది కాదని లోకేష్ అంటున్నాడు.. బాడీ లాస్ కోసం ప్రయత్నించి లోకేష్ కు మైండ్ లాస్ అయ్యినట్టు ఉంది అని ఎద్దేవా చేశారు.. అన్ని…
Minister Venugopala Krishna: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను ఉద్దేశిస్తూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు చేశారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన అనైతిక కలయికలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, పరిపాలన పట్ల చంద్రబాబు మాట్లాడలేడు అని.. ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నేతలను దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్రలకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిదర్శనమని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. వైసీపీ నేతలపై బురద జల్లి లబ్ధి పొందాలని…
At Home in Raj Bhavan: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి హాజరయ్యారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. అంతేకాకుండా పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు.…
Gorantla Madhav Challenge to Tdp Leaders: తన వీడియో వ్యవహారం తర్వాత వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తొలిసారిగా అనంతపురం వస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కురువ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బళ్ళారి చౌరస్తా వద్ద ఆలయంలో గోరంట్ల మాధవ్ ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అనంతపురం బయలుదేరి వెళ్తుండగా ఆయన మాట్లాడుతూ.. తన వీడియో ఒరిజినల్ అని అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక…
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూర్ జయరాం.. కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కలియుగ రావణాసురులు చంద్రబాబు, లోకేష్ అంటూ మండిపడ్డారు.. రాష్ట్రంలో కొందరిని శూర్పణఖలను తయారు చేసిన ఘనత చంద్రబాబుదేనంటూ ఎద్దేవా చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ అని ఎస్పీ విచారణలో తేలిందని స్పష్టం చేసిన మంత్రి.. అయినా, ఆ వ్యవహారంలో ఇంకా వివాదం…
బాధితులు ఎవరూలేని ఘటనలో కూడా టీడీపీ ఆరోపణలు చేస్తోంది అంటూ ఫైర్ అయ్యారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బాధితులు ఎవరూ లేని ఘటనలో టీడీపీ ఆరోపిస్తుంది… గతంలో ఇలాంటి ఆరోపణలు వస్తే సీఎం జగన్ ఉపేక్షించలేదని గుర్తుచేశారు. గడిచిన వారం రోజులుగా ఇదే అంశాన్ని పట్టుకొని వేలాడుతున్నారని మండిపడ్డ ఆయన.. సమస్యల పై స్పందించకుండా ఇలాంటి దిగజారుడు పనులు చేస్తున్నారని విమర్శించారు. దిశా లాంటి చట్టాలను చేసి మహిళలకు రక్షణ కల్పిస్తుంటే…
Ambati Rambabu: గోదావరికి మళ్ళీ వరద వచ్చే పరిస్థితి ఉందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం, ధవళేశ్వరం దగ్గర పది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందన్నారు. దీంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా నదికి కూడా వరద తాకిడి ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు దిగువ ప్రాంతాలకు వచ్చే…
Gorantla Madhav: ఓ మహిళతో నగ్నంగా తాను మాట్లాడిన వీడియో ఫేక్ అని అనంతపురం ఎస్పీనే నిర్ధారించారని.. ఈ వీడియో మార్ఫింగ్ అని తాను ఆనాడే చెప్పానని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించారు. ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కొంతమంది దుర్మార్గులు కలిసి చేసిన పని అని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి ఈ కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. బీసీలు ఎదుగుతుంటే చూసి…