Kodali Nani: అంత మంచి కుటుంబంలో పుట్టి.. చంద్రబాబు భజనెందుకు పవన్?
Kodali Nani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డాడని జగన్పై చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మకుండా అధికారాన్ని కట్టబెట్టారని.. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే పప్పు నాయుడు చంద్రబాబు అని కొడాలి నాని ఆరోపించారు. అటు పప్పు నాయుడు కుమారుడు తుప్పు నాయుడు మంగళవారం మాటలు మాట్లాడుతున్నాడని.. వారంలో ఏదో జగన్ వ్యవహారం బయటపెడతానని వాగుతున్నాడని.. అదేదో మొన్న మంగళవారమే ఉత్తర కుమారుడు బయటపెట్టవచ్చు కదా అని కొడాలి నాని నిలదీశారు. అటు చిరంజీవి లాంటి మంచి వ్యక్తి కుటుంబంలో పుట్టి పవన్ కళ్యాణ్కు ఎందుకింత కర్మ అని కొడాలి నాని ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతూ పవన్ దిగజారిపోయాడని విమర్శించారు.
Read Also: Naga Babu: అన్నయ్య బర్త్ డే రోజు.. ఆయనకే తెలియని విషయం చెప్తా..!!
Also Read
- Central Minister: ఏపీ రాజధాని నిర్మాణంపై.. కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక వ్యాఖ్యలు..
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
రెండు చోట్ల ఓడిపోయినా పవన్ కళ్యాణ్కు ఇంకా సిగ్గు రాలేదని.. ఇంకా చంద్రబాబు భజన చేస్తున్నాడని.. జగన్ను దించేయాలని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇసుక పేరుతో డబ్బులు దోచుకుంటున్నానని తప్పుడు ఆరోపణలు చేయడం పవన్కు తగదు అని సూచించారు. పవన్కళ్యాణ్కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానని.. ఆయన గుడివాడకు వచ్చిన తనకు ఐదు లారీలు ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి నేతలు, మీడియా సంస్థలు ప్రజల సొమ్మును దోచుకున్నాయని.. తమ ప్రభుత్వం టెండర్లు కట్టబెట్టి ఇసుకను విక్రయించి గత ఐదేళ్లలో 4వేల కోట్ల నిధులను సమీకరించిందని కొడాలి నాని వివరించారు. 150 ట్రక్కులు తనవే అని పవన్ ఎలా చెప్తాడని ప్రశ్నించారు. అటు గుడివాడలో క్యాసినో జరగలేదని.. కానీ చికోటి ప్రవీణ్పై ఈడీ దాడులు చేయాలని రాజకీయ ప్రత్యర్థులు ఒత్తిడి చేస్తున్నారని.. ఈ వ్యవహారంలోకి తనను లాగాలని ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. పనికిమాలిన వీడియోలపై మాట్లాడేందుకు గ్రీష్మ, అనిత లాంటి మహిళా నేతలు ఎందుకని టీడీపీని నిలదీశారు. ఫేక్ వీడియోతో మాధవ్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Be Alert : ఫ్రీగా సినిమా చూద్దామని కక్కుర్తిపడి ₹1,75,000 కోల్పోయిన వ్యక్తి!
-
T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
-
Vijay And Karunanidhi: కరుణానిధితో విజయ్ పాత ఫోటో వైరల్.. ఆర్జీవీ సంచలన ట్వీట్..
-
Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
-
KTR : రైతు సమస్యలపై ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!