Chandrababu: అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా? అన్ని కులాలు నా కులాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెనాలికి చెందిన వైసీపీ నేత గుదిబండ గోవర్ధన్రెడ్డి తన అనుచరులతో పాటు టీడీపీలో చేరారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి సోదరుడి కుమారుడే గోవర్ధన్ రెడ్డి. పదేళ్ల పాటు వైసీపీలో కొనసాగిన ఆయన తాజాగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితే రాష్ట్రానికి భవిష్యత్ ఉండదన్న భావనలో ప్రజలు ఉన్నారని.. ఓ స్పష్టమైన లక్ష్యంతోనే తాను టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు.
Read Also: Ys Sharmila: ఉప ఎన్నికలతో అభివృద్ధా? …సిగ్గుచేటు
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
- TDP Mahanadu: మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి..
- IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
అటు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత మూడేళ్లు వైసీపీ ప్రభుత్వం అరాచకాలతో పాలన సాగిస్తోందని.. వైసీపీ పాలన పట్ల ప్రజలు విసుగు, ఆవేదన చెందుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీని వీడటమే అని చెప్పారు. మనసున్న కార్యకర్తలు వైసీపీలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదన్నారు. వైసీపీ నేతలు సెటిల్ మెంట్ రాజకీయాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. దీంతో చాలా మంది తాము సంపాదించుకున్న సొమ్మును వైసీపీ నేతలు ధారాదత్తం చేస్తున్నారని.. ప్రాణం కంటే ఆస్తి ఎక్కువ కాదని ప్రజలు వదులుకుంటున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని చంద్రబాబు విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. నిరసనలు చేపడుతుంటే ఇంటి ముందు తాళ్లు కట్టి తమను అడ్డుకుంటున్నారని.. ఈ తాళ్లే వైసీపీ వాళ్లకు ఉరితాళ్లుగా మారతాయని చంద్రబాబు హెచ్చరించారు. జీవితంలో తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ అరాచకాలతో ప్రజలు భయపడుతుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకుంటారా అని మండిపడ్డారు. దేశంలో ఎవరూ జగన్ తరహాలో అంబేద్కర్ను అవమానించలేదన్నారు. చేతకాని వాడే కులాల గురించి మాట్లాడతారని తన అభిప్రాయమని.. అన్ని కులాలు తన కులాలే అని స్పష్టం చేశారు. అనంతపురంలో కియా పెడితే బడుగులకే ఎక్కువ లబ్ది చేకూరిందన్నారు. కుప్పంలో 100 కమ్మ కుటుంబాలు కూడా ఉండవని.. తనకు ఓట్లేసి గెలిపించింది బడుగులే అని తెలిపారు. ఏ కులంలో పేదరికం ఉంటే.. ఆ కులానికే తన ప్రాధాన్యత అన్నారు.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..