Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ycp Leader Gudibanda Goverdhanreddy Joined In Telugu Desam Party

Chandrababu: అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా? అన్ని కులాలు నా కులాలే

Published Date :August 19, 2022 , 6:35 pm
By Ramesh Nalam
Chandrababu: అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా? అన్ని కులాలు నా కులాలే
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Chandrababu: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెనాలికి చెందిన వైసీపీ నేత గుదిబండ గోవర్ధన్‌రెడ్డి తన అనుచరులతో పాటు టీడీపీలో చేరారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకట‌రెడ్డి సోద‌రుడి కుమారుడే గోవ‌ర్ధన్ రెడ్డి. ప‌దేళ్ల పాటు వైసీపీలో కొన‌సాగిన ఆయ‌న తాజాగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గోవ‌ర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆరోప‌ణ‌లు చేశారు. జ‌గ‌న్ మ‌ళ్లీ సీఎం అయితే రాష్ట్రానికి భ‌విష్యత్ ఉండ‌ద‌న్న భావ‌న‌లో ప్రజ‌లు ఉన్నార‌ని.. ఓ స్పష్టమైన ల‌క్ష్యంతోనే తాను టీడీపీలో చేరుతున్నాన‌ని ప్రకటించారు.

Read Also: Ys Sharmila: ఉప ఎన్నికలతో అభివృద్ధా? …సిగ్గుచేటు

Also Read

  • AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
  • TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
  • MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
  • Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
Add as a preferred
source on google

అటు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత మూడేళ్లు వైసీపీ ప్రభుత్వం అరాచకాలతో పాలన సాగిస్తోందని.. వైసీపీ పాలన పట్ల ప్రజలు విసుగు, ఆవేదన చెందుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇందుకు నిద‌ర్శన‌మే గోవ‌ర్ధన్ రెడ్డి ఆ పార్టీని వీడ‌ట‌మే అని చెప్పారు. మ‌న‌సున్న కార్యకర్తలు వైసీపీలో కొన‌సాగేందుకు ఇష్టప‌డ‌టం లేద‌న్నారు. వైసీపీ నేతలు సెటిల్ మెంట్ రాజకీయాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. దీంతో చాలా మంది తాము సంపాదించుకున్న సొమ్మును వైసీపీ నేతలు ధారాదత్తం చేస్తున్నారని.. ప్రాణం కంటే ఆస్తి ఎక్కువ కాదని ప్రజలు వదులుకుంటున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని చంద్రబాబు విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. నిరసనలు చేపడుతుంటే ఇంటి ముందు తాళ్లు కట్టి తమను అడ్డుకుంటున్నారని.. ఈ తాళ్లే వైసీపీ వాళ్లకు ఉరితాళ్లుగా మారతాయని చంద్రబాబు హెచ్చరించారు. జీవితంలో తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ అరాచకాలతో ప్రజలు భయపడుతుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకుంటారా అని మండిపడ్డారు. దేశంలో ఎవరూ జగన్ తరహాలో అంబేద్కర్‌ను అవమానించలేదన్నారు. చేతకాని వాడే కులాల గురించి మాట్లాడతారని తన అభిప్రాయమని.. అన్ని కులాలు తన కులాలే అని స్పష్టం చేశారు. అనంతపురంలో కియా పెడితే బడుగులకే ఎక్కువ లబ్ది చేకూరిందన్నారు. కుప్పంలో 100 కమ్మ కుటుంబాలు కూడా ఉండవని.. తనకు ఓట్లేసి గెలిపించింది బడుగులే అని తెలిపారు. ఏ కులంలో పేదరికం ఉంటే.. ఆ కులానికే తన ప్రాధాన్యత అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Government
  • ap politics
  • chandrababu
  • CM Jagan Mohan Reddy
  • Mangalagiri

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions