High Tension in Kuppam: కుప్పంలో ఉద్రిక్తత.. అన్నా క్యాంటీన్ ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత నియోజకవర్గంలో రెండవ రోజు పర్యటన కొనసాగుతోంది. కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు బంద్ కు పిలుపునిచ్చారు. అన్నా క్యాంటీన్ ధ్వంసం చేశారు. పోటాపోటీగా నిరసనలకు సిద్ధం అయ్యాయి టీడీపీ, వైసీపీ వర్గాలు. కుప్పంకు చేరుకోవాలంటూ వాట్సాప్ ద్వారా సందేశాలు వచ్చాయి. చంద్రబాబు పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. కుప్పం బంద్ కు వైసీపీ పిలుపునివ్వడంతో… వ్యాపారులు వారి దుకాణాలను మూసేశారు. ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పలు చోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
Read Also: Welfare Schemes : సంక్షేమ పథకాలు శృతిమించాయా..? ఉచితాలు ఏమిటనే దానిపై గందరగోళం..!
Also Read
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
మరోవైపు బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తలంతా కుప్పంకు చేరుకోవాలని రెండు పార్టీలు వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుతున్నాయి. పరిస్థితిని జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. రామకుప్పంలో నిరసన ర్యాలీకి వైసీపీ శ్రేణులు రెడీ అయ్యాయి. కొల్లుపల్లెలో రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎస్పీ రిషాంత్ రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా వుంటే చంద్రబాబు తీవ్ర నిరసనకు దిగారు. నడిరోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలపై లాఠీ ఛార్జిని చంద్రబాబు ఖండించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
-
Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..