Purandeswari On Budameru: నేడు శుక్రవారం బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని., గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రతి సందర్బంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదని.. రూ. 400 కోట్లతో బుడమేకు కట్ట పటిష్టతకు టీడీపీ పనులు ప్రారంభించిన.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించ…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. జోగి రమేష్కు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని జోగి రమేష్కు ఇచ్చిన తాజా నోటీసుల్లో పేర్కొన్నారు మంగళగిరి పోలీసులు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. నేడు దేశరాజధాని ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు విజయవాడకు బయల్దేరనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎంను టీడీపీ నేతలు కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ సహా ఐదుగురు కేంద్ర మంత్రులను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. వారి దృష్టికి పలు ముఖ్యమైన అంశాలను తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్లో…
Chandrababu Naidu: నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది. తెలంగాణాలో పార్టీ పునర్నిర్మాణం పై చర్చ జరిగింది., ప్రస్తుతం ఉన్న పార్టీ పదవులు అన్ని రద్దు చేసినట్లు.., రాష్ట్ర నూతన అధ్యక్ష ఎన్నికకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ స్థాయిలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు సూశించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేలా పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. Sheikh Hasina: షేక్…
ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా బేసిన్లో ఎగువున ఉన్న ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి. దిగువ ప్రాజెక్టుల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. కొన్నేళ్లుగా నీటి కొరతను ఎదుర్కొన్న ఏపీలో ఇప్పుడు కృష్ణమ్మ ఉగ్రరూపం భయపెడుతోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కేవలం వారికి సంబంధించిన పత్రికల్లో అవాస్తవాలు ప్రచురించి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
చీరాల మండలం జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి నేడు సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అనంతరం చేనేత కార్మికులతో కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
అప్కాబ్ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు.. గత ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేయనున్నట్టు వెల్లడించారు.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేయనున్నాం.. త్వరలో కొత్త చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు.. చిట్టచివరి కౌలు రైతుకు సైతం న్యాయం జరగాలి అనేది తమ ప్రభుత్వ ఉద్దశ్యంగా స్పష్టం చేశారు.
చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో అప్కాబ్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించారు మంత్రి అచ్చెన్నాయుడు
తమకు తెలియకుండా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) అమలు చేస్తూ గెజిట్ విడుదల చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జీపీఎస్ విధానంపై గత ప్రభుత్వ నిర్ణయాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే రీతిలో గెజిట్ విడుదలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.