Nimmala Ramanaidu: 2026 మే నెల చివరి వరకు 28,946 మందికి రూ. 900 కోట్లతో పునరావాసం కల్పిస్తామని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2027 మార్చి వరకు పోలవరం నిర్వాసితులను పునరావాసం పూర్తి చేస్తామని తెలిపారు. పడకేసిన పోలవరం పనులను కార్యరూపం దాల్చేలా పనిచేస్తున్నామన్నారు. తాజాగా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్తో భేటీ అయ్యారు.
YS Jagan: మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో విద్యార్థులు మృతి చెందటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం పాలనలో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. అయినా వాళ్లకు కనికరం కూడా లేదని సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో ట్వీట్ చేశారు.
Srisailam: శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవావయా, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చ జరిగింది. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక…
Balakrishna: ఏపీ బ్రాండ్ సీఎం చంద్రబాబు అని హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయన్నారు. అందుకే చంద్రబాబు 24 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. తాజాగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం దేశ పటంలోనే సువర్ణ అక్షరాలతో లికించబడుతుందని కొనియాడారు. ఆధ్యాత్మికం, పర్యాటకం మిళితమైన కార్యక్రమని..
Somireddy Chandra Mohan Reddy: హౌసింగ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 వేల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తావించారు. సొంతంగా ఇళ్లు కట్టుకోలేని గిరిజన బిడ్డలతో పాటు నిరుపేదలకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూ.2.30 లక్షల చొప్పున మంజూరు చేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ మొత్తాన్ని జగన్ రెడ్డి రూ.1.80 లక్షలకు తగ్గించారని.. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగనన్నకాలనీల పేరుతో దుర్మార్గాలకు…
CM Chandrababu: 2014-19 మధ్య కాలంలో అన్న క్యాంటీన్లు పెట్టాం.. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు పెడితే.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని మరింత అభివృద్ధి చేసింది.. కానీ ఏపీలో దౌర్బాగ్యం.. అన్న క్యాంటీన్లను రద్దు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తాజాగా అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు 204 అన్న క్యాంటీన్లు ఉన్నాయి.. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 70…
టీడీపీ నేతలకు బెల్ట్ షాపులు ఉపాధి హామీ పథకం కింద మారాయని వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. బెల్టు షాపులు పెడితే బెండు తీస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ఎంతమంది బెండు తీశారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. బెల్టు…
CM Chandrababu: టీటీడీ భక్తులకు సీఎం గుడ్న్యూస్ చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మిస్తున్నారు. నూతన బస్స్టాండ్ అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
YS Sharmila: APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో ఏపీలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలపై కూటమి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ అని పేర్కొనడం సిగ్గుచేటుతో కూడినదని, ప్రజలకు ఇవ్వాల్సిన వాగ్దానాలు పూర్తిగా అమలులోకి వచ్చాయని చెప్పడం హాస్యాస్పదమని ఆమె పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఒక్కటైనా పూర్తిగా అమలు అయ్యిందా? రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులలో ఒక్కరికి కూడా 3,000 రూపాయల భృతి అందించిందా? కూటమి…