PM Modi Srisailam Visit: ప్రధాని మోడీ శ్రీశైలం పర్యటన కొనసాగుతోంది. తాజాగా ప్రధాని శ్రీశైలానికి చేరుకున్నారు. తొలిసారి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు.. ఆలయం వద్ద సీఎం డిప్యూటీ సీఎం, శివసేవకులు, కూటమి కార్యకర్తలు, బీజేపీ అభిమానులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
PM Modi Visits Srisailam Temple: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలంకు చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం సైనిక హెలికాఫ్టర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీ శైలంకు చేరుకున్నారు. అక్కడ శ్రీశైలం భ్రమరాంబ అతిథి గృహానికి విచ్చేశారు. కాసేపట్లో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు.…
PM Modi Tour: నేడు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన కొనసాగనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నన్నూరు సమీపంలో "సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్" పేరుతో ప్రధాని మోడీ భారీ బహిరంగసభ కొనసాగనుంది. 3 లక్షల మందితో సూపర్ జీఎస్టీ సభ ఏర్పాటు చేయనున్నారు. 400 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేపట్టారు. 360 ఎకరాల్లో 12 పార్కింగ్ ప్రదేశాలు, 50 ఎకరాల్లో సభా ప్రాంగణం, వేదిక ఉండనుంది. జన సమీకరణకు దాదాపుగా 7వేల…
PM Modi Srisailam Tour: నేడు శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటనకు సర్వం సిద్ధమైంది.. మోడీ పర్యటనకు కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణ కొనసాగుతోంది.. శ్రీశైల క్షేత్రం భద్రతావలయంలో ఉంది. ప్రధాని మోడీ పర్యటన పూర్తయ్యే వరకు శ్రీశైలంలో రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ శ్రీశైలం వెళ్లే దారులలో ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు.
Off The Record: ప్రభుత్వాన్ని కొంతవరకు నడుపుతోంది కన్సల్టెంట్లే కదా..? అంతా వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది కదా…? ఇదీ… ఇటీవల ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్య. జరుగుతున్న పరిణామాల్ని తెలుసుకుని అన్నారో… లేక స్వయంగా ఆయనే ఇబ్బంది పడ్డారోగానీ…దాని గురించే ఇప్పుడు పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే కన్సల్టెంట్స్… సలహాలు, సూచనలు ఇవ్వడం మొదలు పెట్టారో…. అప్పుడే పార్టీ నాయకులు మంత్రుల సహజ శైలి మరుగునపడిపోయిందని, సందర్భానుసారం స్పాంటేనియస్గా స్పందించలేకపోతున్నారన్నది పార్టీ వర్గాల…
Minister Kollu Ravindra: నకిలీ మద్యంపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలి అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కుట్రలు అన్నీ కృష్ణా జిల్లా నుంచి జరగడం దురదృష్టకరం అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ రావడం పట్ల లోకేష్, చంద్రబాబులను అభినందించాలని పేర్కొన్నారు.
AP Govt- Google Deal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ కంపెనీ ఈరోజు ( అక్టోబర్ 14న) ఢిల్లీలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది. విశాఖపట్నంలో రూ.88,628 కోట్ల గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ కుదరనుంది.
CM Chandrababu: సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టే గుంటూరు- విజయవాడ మధ్య జిల్లాలో రాజధానిగా ప్రకటించాం.. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ పెడితే అవహేళన చేశారు.
గాలి, బొగ్గు, నీరు, సోలార్తో విద్యుత్ ఉత్పత్తి కావడం తాను చూశానని.. ఎద్దులను ఉపయోగించి కరెంట్ ప్రొడ్యూస్ చేయడం తొలిసారి చూస్తున్నా అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో నందగోకులం లైఫ్ స్కూల్ను ప్రారంభించిన అనంతరం.. విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్కు సీఎం శ్రీకారం చుట్టారు. నందగోకులం ప్రాంగణంలో మూడు ప్రాజెక్టులు ప్రారంభించానని చెప్పారు. ఆహారం, నిద్ర, వ్యాయామం, మంచి పనులు చేస్తూ.. అందరూ ఆరోగ్యంగా ఉండండని సీఎం సూచించారు. సమాజం…