Nimmala Rama Naidu: 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం!
- వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరగడంపై సీఎం ఆవేదన
- ప్రతి 15 రోజులకి ఒకసారి ప్రాజెక్టు నిర్మాణంపై రివ్యూ
- 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 96లో సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారని, 30 ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం జరగడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రతి 15 రోజులకి ఒక సారి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంపై రివ్యూ చేస్తున్నారని, 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం అని చెప్పారు. పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును వైఎస్ జగన్ జాతికి అంకితం అంటూ ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని నిమ్మల చెప్పుకొచ్చారు.
మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి మంత్రి నిమ్మల ఈరోజు పరిశీలించారు. ప్రాజెక్టు పెండింగ్ పనులపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జంట సొరంగాల్లోకి వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని.. ఫీడర్ కెనాల్ సీసీ వాల్ లైనింగ్ నిర్మాణం డిజైన్స్ అప్రూవల్ చేయాలని సూచించారు. ఫీడర్ కెనాల్ లైనింగ్, 3 కి.మీ పొడవున రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల కోసం రూ.456 కోట్లతో టెండర్లు పిలిచాం అని, ఈ నెలలో ఫీడర్ కెనాల్ పనులు మొదలుపెట్టబోతున్నాం అని మంత్రి నిమ్మల తెలిపారు.
Also Read
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
‘వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 96లో సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. 30 ఏళ్ళుగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరగడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 15 రోజులకి ఒక సారి చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంపై రివ్యూ చేస్తున్నారు. 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పగలు, రాత్రి పనులు జరుగుతున్నాయి. వెలిగొండ నిర్మాణం పూర్తి కాకుండానే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రారంభించారు. తల్లినీ, చెల్లిని మోసం చేసిన ఆయనకి ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చెయ్యడం లెక్కకాదు. జగన్ చర్యలు హాస్యాస్పదం. జగన్ మానసిక పరిస్థితి విచిత్రంగా ఉంది. జగన్ ప్రభుత్వంలో నిర్వాసితులకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. హంద్రీనివా రాయలసీమకి జీవనాడి. 2025లోనే హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేశాం’ అని మంత్రి నిమ్మల గుర్తు చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
-
FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
-
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!