YS Jagan : చంద్రబాబు చేస్తున్నది ప్రజా వ్యతిరేక నిర్ణయం.. 12న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న దరిద్రపు పని
- స్కాములు చేస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నాడు
- మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం
- పత్రి జిల్లాకో గవర్నమెంట్ కాలేజీ తీసుకొచ్చాం
- చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదు
- ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినా సరిపోయేది. -వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan : ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్య రంగంపై సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం దరిద్రపు పని అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడుతూ.. “మూడేళ్లలో మేము 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. ప్రతి జిల్లాలో గవర్నమెంట్ కాలేజీలు ఏర్పరిచాం. కానీ చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేసి అయినా ప్రజల ఆరోగ్య భవిష్యత్తును కాపాడాలి,” అని అన్నారు.
చంద్రబాబు మంచి చేయకపోగా, చెడు చేస్తున్నారని విమర్శించిన ఆయన, విద్యార్థులు దీనిపై ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందన్నారు. “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న ర్యాలీలు నిర్వహిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్పై డిసెంబర్లో ఆందోళనలు చేపడతాం. అంతవరకు చంద్రబాబుకు సమయం ఇస్తున్నాం,” అని జగన్ చెప్పారు.
Also Read
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
- CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు ఏపీ.. సింగపూర్లో చంద్రబాబు కీలక ప్రసంగం
అంతేకాకుండా.. “మా వైసీపీ ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసింది. విద్యా దీవెన కింద రూ.12,609 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి రూ.20 వేల చొప్పున అందించాం. పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా చూశాం,” అని గుర్తుచేశారు. “పేదలకు చదువు భారం కాకూడదు. కానీ ఈ ప్రభుత్వం అన్నింటినీ ధ్వంసం చేస్తోంది. పిల్లలు చదవకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. రూ.4,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, రూ.2,200 కోట్ల వసతి దీవెన పెండింగ్లో ఉంచారు. మా హయాంలో ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల మందికి ఉపాధి కల్పించాం,” అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
AP Update : ఏపీ సర్కార్ సంచలనం.. గ్రామ సచివాలయాల పేరు మార్పు
తాజావార్తలు
-
Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
-
Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
-
Natti Kumar: ‘పెద్ది’ కలెక్షన్లపై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం!
-
India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
-
Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?