YS Jagan : చంద్రబాబు చేస్తున్నది ప్రజా వ్యతిరేక నిర్ణయం.. 12న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న దరిద్రపు పని
- స్కాములు చేస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నాడు
- మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం
- పత్రి జిల్లాకో గవర్నమెంట్ కాలేజీ తీసుకొచ్చాం
- చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదు
- ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినా సరిపోయేది. -వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan : ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్య రంగంపై సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం దరిద్రపు పని అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడుతూ.. “మూడేళ్లలో మేము 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. ప్రతి జిల్లాలో గవర్నమెంట్ కాలేజీలు ఏర్పరిచాం. కానీ చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేసి అయినా ప్రజల ఆరోగ్య భవిష్యత్తును కాపాడాలి,” అని అన్నారు.
చంద్రబాబు మంచి చేయకపోగా, చెడు చేస్తున్నారని విమర్శించిన ఆయన, విద్యార్థులు దీనిపై ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందన్నారు. “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న ర్యాలీలు నిర్వహిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్పై డిసెంబర్లో ఆందోళనలు చేపడతాం. అంతవరకు చంద్రబాబుకు సమయం ఇస్తున్నాం,” అని జగన్ చెప్పారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
అంతేకాకుండా.. “మా వైసీపీ ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసింది. విద్యా దీవెన కింద రూ.12,609 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి రూ.20 వేల చొప్పున అందించాం. పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా చూశాం,” అని గుర్తుచేశారు. “పేదలకు చదువు భారం కాకూడదు. కానీ ఈ ప్రభుత్వం అన్నింటినీ ధ్వంసం చేస్తోంది. పిల్లలు చదవకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. రూ.4,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, రూ.2,200 కోట్ల వసతి దీవెన పెండింగ్లో ఉంచారు. మా హయాంలో ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల మందికి ఉపాధి కల్పించాం,” అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
AP Update : ఏపీ సర్కార్ సంచలనం.. గ్రామ సచివాలయాల పేరు మార్పు
తాజావార్తలు
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!