YS Jagan : చంద్రబాబు చేస్తున్నది ప్రజా వ్యతిరేక నిర్ణయం.. 12న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న దరిద్రపు పని
- స్కాములు చేస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నాడు
- మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం
- పత్రి జిల్లాకో గవర్నమెంట్ కాలేజీ తీసుకొచ్చాం
- చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదు
- ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినా సరిపోయేది. -వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan : ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్య రంగంపై సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం దరిద్రపు పని అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడుతూ.. “మూడేళ్లలో మేము 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. ప్రతి జిల్లాలో గవర్నమెంట్ కాలేజీలు ఏర్పరిచాం. కానీ చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేసి అయినా ప్రజల ఆరోగ్య భవిష్యత్తును కాపాడాలి,” అని అన్నారు.
చంద్రబాబు మంచి చేయకపోగా, చెడు చేస్తున్నారని విమర్శించిన ఆయన, విద్యార్థులు దీనిపై ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందన్నారు. “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న ర్యాలీలు నిర్వహిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్పై డిసెంబర్లో ఆందోళనలు చేపడతాం. అంతవరకు చంద్రబాబుకు సమయం ఇస్తున్నాం,” అని జగన్ చెప్పారు.
Also Read
- AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటన..
- Botsa Satyanarayana: ‘ప్రజా సమస్యలను వదిలేసి ప్రభుత్వం పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోంది’..
- AP Rain Alert: ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
- El Niño Impact: కొబ్బరిబొండాల పైనా 'ఎల్నినో' ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
అంతేకాకుండా.. “మా వైసీపీ ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసింది. విద్యా దీవెన కింద రూ.12,609 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి రూ.20 వేల చొప్పున అందించాం. పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా చూశాం,” అని గుర్తుచేశారు. “పేదలకు చదువు భారం కాకూడదు. కానీ ఈ ప్రభుత్వం అన్నింటినీ ధ్వంసం చేస్తోంది. పిల్లలు చదవకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. రూ.4,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, రూ.2,200 కోట్ల వసతి దీవెన పెండింగ్లో ఉంచారు. మా హయాంలో ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల మందికి ఉపాధి కల్పించాం,” అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
AP Update : ఏపీ సర్కార్ సంచలనం.. గ్రామ సచివాలయాల పేరు మార్పు
తాజావార్తలు
-
Mojtaba Khamenei: హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు.. “జిహాద్, ప్రతిఘటనే ఏకైక మార్గం”.. మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
-
The Paradise: 20 కోట్ల వ్యూస్తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్పై బిగ్ అప్డేట్!
-
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ
-
Ram Charan: రామ్ చరణ్కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!