CM Chandrababu at Acharya N.G. Ranga 125th Birth Anniversary: ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
- గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకలు..
- ఎన్జీ రంగాకు ఘనంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..
- ఎన్జీ రంగా స్వాతంత్య్ర పోరాటంలో, రైతాంగ ఉద్యమంలో పాల్గొన్నారు..
- రంగా ఆర్థిక శాస్త్రంలో నైపుణ్యత సాధించి..
- గాంధీజీ పిలుపుతో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu at Acharya N.G. Ranga 125th Birth Anniversary: ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్జీ రంగా దేశ స్వాతంత్య్ర పోరాటంలో, రైతాంగ ఉద్యమంలో, గ్రామీణ అభివృద్ధిలో చేసిన విశేష సేవలను గుర్తుచేశారు. “ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతితో పాటు వందేమాతరం 150వ వార్షికోత్సవాలు ఒకే రోజున జరగడం చారిత్రాత్మకం” అన్నారు. రంగా ఆర్థిక శాస్త్రంలో నైపుణ్యత సాధించి, గాంధీజీ పిలుపుతో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. సైమన్ కమిషన్ గో బ్యాక్, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. కేవలం 33 ఏళ్ల వయసులో ఆంధ్ర రైతాంగ ఉద్యమాన్ని ముందుకు నడిపి, రైతులకు శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల ప్రారంభించారని చెప్పారు.
Read Also: Illegal Nuclear: పాకిస్తాన్ కూడా రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తుంది..
Also Read
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
ఎన్డీ రంగా దేశం కోసం, రైతుల కోసం ఒకే సమయంలో పోరాడారు. 1964లో వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంటులో రద్దు చేయాలని కఠినంగా పోరాడారు అని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. జవహర్లాల్ నెహ్రూ కూడా “రంగా పార్లమెంట్లో ఉన్నంతకాలం రైతులు సుభిక్షంగా ఉంటారు” అని అన్నారని తెలిపారు. రంగా చేసిన సేవలకు పద్మవిభూషణ్తో పాటు అనేక అవార్డులు లభించాయని అన్నారు. తాను మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రంగా పేరు పెట్టినట్లు, ఆ పేరు రాష్ట్ర విభజన తర్వాత తొలగించారని, అందుకే ఏపీలో కొత్తగా రంగా పేరిట విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు.
Read Also: CM Revanth Reddy : బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కేటీఆర్.. ఇద్దరు కలిసి..
యాభై ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యునిగా ఉన్న అరుదైన వ్యక్తి రంగా.. ప్రాంతాలకు అతీతంగా నాలుగు నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలిచారు అని పేర్కొన్నారు చంద్రబాబు.. రంగా స్ఫూర్తితోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తాను పీహెచ్డీ చేసినట్లు తెలిపారు.. ఇక, ఎన్డీయే ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, 2014–19 మధ్య వ్యవసాయ జీఎస్డీపీ 6 శాతం పైగా పెరిగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో అది తగ్గిపోయిందని విమర్శించారు. మా ప్రభుత్వం రైతులకు ధాన్య డబ్బులు 24 గంటల్లో జమ చేస్తోంది. అన్నదాత సుఖీభవ కోసం రూ.3,000 కోట్లు కేటాయించాం అన్నారు. మొంథా తుఫాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు సాంకేతికత సాయం తీసుకున్నామని, ప్రభుత్వ చర్యలతో నష్టం పరిమితమైందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!