CM Chandrababu : అభివృద్ధికి కొత్త దిక్సూచి.. కుప్పంలో ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన
- కుప్పంలో ఏడు పరిశ్రమలకు సీఎం చంద్రబాబు వర్చువల్ శంకుస్థాపన
- ₹2,203 కోట్ల పెట్టుబడులతో 241 ఎకరాల్లో భారీ పరిశ్రమలు
- పరిశ్రమల రాకతో ఉపాధి పెరుగుదలపై స్థానికుల ఆనందం
- బెంగళూరు వలసలకు స్వస్తి… కుప్పం అభివృద్ధిపై ప్రజల్లో నమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : కుప్పం ప్రాంతం పరిశ్రమల హబ్గా మారే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక అడుగు వేశారు. వర్చువల్గా ఏకకాలంలో ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసి కుప్పం అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేశారు. హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E-Royce EV, ALEAP మహిళా పార్కులు.. ఈ సంస్థల ద్వారా మొత్తం రూ. 2,203 కోట్ల పెట్టుబడులు కుప్పంలోకి రానున్నాయి. ఈ పరిశ్రమల కోసం ప్రభుత్వం 241 ఎకరాల భూమిని కేటాయించింది.
CM Chandrababu : 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. నోటీసులకు ఆదేశం
Also Read
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు కుప్పం స్థానిక రైతులు, పాడి రైతులు, మహిళలు, యువతతో ముఖాముఖి జరిపారు. అభివృద్ధి పట్ల ప్రజలు వ్యక్తం చేసిన ఆనందం, కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హంద్రీ-నీవా కాల్వ ద్వారా నీటిసౌకర్యం అందడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కుప్పంకు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, పాలు కొనుగోలు చేసే సంస్థలు రావడం వల్ల తమ పంటలు, పాల ఉత్పత్తులను ఇక్కడి పరిశ్రమలకే నేరుగా విక్రయించే అవకాశం వస్తుందని రైతులు తెలిపారు. పరిశ్రమలు ఇంత పెద్ద సంఖ్యలో కుప్పానికి వస్తాయని కలలో కూడా అనుకోలేదని మహిళా పాడి రైతులు హర్షం వ్యక్తంచేశారు.
తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిపొందుతున్నామని మహిళలు తెలిపారు. గతంలో ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్లాల్సి వచ్చేదని, ఇక పరిశ్రమలు స్థాపించడంతో కుప్పంలోనే ఉపాధి దొరకనున్నందుకు ఆనందంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. తమ ప్రాంతంలో వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలను తీసుకొచ్చినందుకు సీఎం చంద్రబాబుకు కుప్పం వాసులు ధన్యవాదాలు తెలిపారు. కుప్పాన్ని పరిశ్రమల కేంద్రంగా రూపుదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం, ఈ ఏడాది పెట్టుబడులతో ప్రతి ఇంటికీ ఉపాధిని చేరవేసే దిశగా పునాది వేసిందని అధికారులు పేర్కొన్నారు.
Komatireddy Venakt Reddy : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం
తాజావార్తలు
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..