CM Chandrababu : అధికారులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
- డేటా డ్రివెన్ గవర్నెన్స్పై సీఎం చంద్రబాబు సీరియస్
- పాల ఉత్పత్తి తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం
- సిజేరియన్ ఆపరేషన్లపై సమీక్ష.. ప్రైవేట్ ఆసుపత్రులకు సూచనలు
- విద్యా రంగం, వ్యవసాయంపై సీఎం ప్రత్యేక దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ (Data Driven Governance) అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు ఆయన సీరియస్ వార్నింగ్ జారీ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలపై సమీక్ష నిర్వహించిన సీఎం, పనితీరు మెరుగు పరచాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ (Animal Husbandry) పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, “గత ఐదేళ్లలో పాల ఉత్పత్తి తగ్గిపోవడం, పశువుల సంఖ్య తగ్గడం ఎందుకు జరిగింది? ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో వివరించండి,” అని అధికారులను ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయని చెప్పిన అధికారులను ఆయన మందలించారు.
Kodanda Reddy: మాట నిలబెట్టుకున్న కోదండరెడ్డి.. వ్యవసాయ శాఖకు రాసిచ్చిన 4 కోట్ల విలువైన భూమి!
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
“ఫస్ట్ క్వార్టర్లో డ్రై సీజన్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ తగ్గిందంటారా? ఇది సమాధానం కాదు. మిమ్మల్ని మళ్లీ రమ్మనడం చెప్పడం జరగదు. ప్రతి అధికారి తన బాధ్యత తీసుకోవాలి,” అని సీఎం కఠిన హెచ్చరిక జారీ చేశారు. అగ్రికల్చర్ ఎకానమీపై కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. “మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. అయితే రైతుల ఆదాయం తక్కువగా ఉంది. ఆదాయం తగ్గకుండా చూడాలి,” అని అన్నారు.
ఆరోగ్య శాఖ పనితీరు పట్ల కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ శస్త్రచికిత్సలు అధికమవుతున్నాయి. వాటిని తగ్గించే చర్యలు తీసుకోవాలి,” అని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా.. “రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 8 లక్షల మంది పాఠశాలల్లో ఉన్నారు. ఈ సంఖ్యను 10 లక్షలకు పెంచాలి. విద్యా రంగంలో నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలి,” అని సీఎం సూచించారు. “కొన్ని శాఖలు బాగా పనిచేస్తున్నాయి. కానీ కొన్ని శాఖలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఏడాదిన్నర పాలన పూర్తవుతోంది. ప్రతి రోజు పనిపై దృష్టి పెట్టాలి. రీబిల్డింగ్ మొదలు పెట్టాలి,” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!