Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Cm Chandrababu At Acharya N G Ranga On His 125th Birth Anniversary

CM Chandrababu: రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వ్యవసాయ ఖర్చులు తగ్గించడంపై పరిశోధనలు..!

Published Date :November 7, 2025 , 7:45 pm
By Sudhakar Ravula
  • కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది..
  • వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచడంపై పరిశోధనలు..
  • సాగులో పురుగుమందుల వాడకం తగ్గించాలని రైతులకు సూచన..
CM Chandrababu: రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వ్యవసాయ ఖర్చులు తగ్గించడంపై పరిశోధనలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu:కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు.. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచడం ద్వారా రైతులకు ఆదాయం పెంచడంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు… సాగులో పురుగుమందుల వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు… రైతు గౌరవం దేశ గౌరవమన్నారు. ఆచార్య ఎన్జీ రంగా 125 జయంతి ఉత్సవాలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబుతోపాటు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు పాల్గొన్నారు. యూనివర్సిటీలో ఎన్జీరంగా జీవితంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. అనంతరం జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్జీ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీ రంగా 125వ జయంతితోపాటు వందేమాతరం 150వసంతాల వేడుక ఒకే రోజున వచ్చాయన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారిలో రంగా కూడా ఒకరన్నారు. గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. 33ఏళ్ల వయసులోనే రంగా ఆంధ్రా రైతాంగ ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. రైతులకు శిక్షణా పాఠశాల పెట్టి వ్యవసాయంలో శిక్షణ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

ఒకవైపు దేశంకోసం మరోవైపు రైతులకోసం పోరాడిన మహనీయుడు ఆచార్య ఎన్జీరంగా అని కొనియాడారు. 1964లో వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచెయ్యాలని పార్లమెంట్ లో రంగా చేసిన పోరాటం ఎవరూ మర్చిపోరన్నారు. రంగా పార్లమెంట్ లో ఉన్నంతకాలం దేశంలో రైతులు సుభిక్షంగా ఉంటారని అప్పటి ప్రధాని నెహ్రు అన్నారంటే రైతులకోసం రంగా ఏస్థాయిలో పోరాడారో అర్దమవుతుందన్నారు. ఆచార్య ఎన్జీరంగా స్పూర్తితో గ్రామీణ ఆర్దిక వ్యవస్థపై తాను పి.హెచ్.డి. చేశానన్నారు. దేశంకోసం పిల్లలు వద్దనుకున్న రంగా దంపతులు ఆదర్శనీయులన్నారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయం పెంచడంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. రైతులకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమ చేశామన్నారు. అన్నదాతా సుఖీభవ పథకం కోసం 3వేలకోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వం పంటభీమా ప్రీమియం కూడా చెల్లించలేదని మండిపడ్డారు. అందువల్లే రైతులకు పంటనష్టం పరిహారం అందలేదన్నారు. సాంకేతికతసాయంతో మొంథా తుఫాన్ కారణంగా ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయన్నారు. వ్యవసాయంలో పురుగుమందులు, రసాయన ఎరువుల వాడకం పెరిగిపోవడంపైఆందోళన వ్యక్తం చేశారు. పురుగుమందుల వాడకం పెంచి పంజాబ్ రైతులు అనారోగ్యాలపాలయ్యారని గుర్తుచేశారు. అందుకే రైతులు పురుగుమందుల వాడకం తగ్గించాలని సూచించారు. రైతు గౌరవమే దేశ గౌరవమన్న రంగా చెప్పిన మాటలు అక్షరసత్యమన్నారు.

ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు రైతులకోసం రంగా చేసిన సేవలను గుర్తు చేశారు. రంగా చేసిన సేవలకు గుర్తించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రంగా గారి పేరు పెట్టారన్నారు. ఎన్జీరంగాకు శ్రీకాకుళంతో అనుబంధం ఉందని గుర్తుచేశారు. రంగా శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచారన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడించి నాణ్యమైన ఉత్పత్తులు పండించేలా యూనివర్సిటీ అధికారులు రైతులను సిద్దం చెయ్యాలని సూచించారు. నేటి రోజుల్లో ప్రజాప్రతినిధులపై ప్రజలకు రోజురోజుకూ అంచనాలు తగ్గిపోతున్నాయని నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. నేటి రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడకపోవడం, బూతులు మాట్లాడకుండా ఉంటే చాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎన్జీరంగా వంటి నేతలు కేవలం విషయాలపై మాట్లాడి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఆయ స్పూర్తితో నేటి రాజకీయ నాయకులు పనిచేస్తూ ప్రజలకు మేలు చెయ్యాలన్నారు. రైతులకు ఎలా మేలు చెయ్యాలో శాస్త్రవేత్తలు ఆలోచించాలని సూచించారు. రైతులు చేసే అన్ని పనులు ఏఐ చెయ్యలేదన్నారు. రైతులసంక్షేమం కోసం ప్రభుత్వంతోపాటు శాస్త్రవేత్తలు కూడా పనిచెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రైతులకు ఆధునీక సాగు పద్దతుల ద్వారా ఆదాయాన్న పెంచే అవకాశాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 125th birth anniversary
  • agricultural growth
  • Andhra Pradesh
  • Chandrababu Naidu
  • CM Chandrababu at Acharya N.G. Ranga 125th Birth Anniversary

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి..

  • Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..

  • Israel vs Iran: ఇరాన్ క్షిపణి వర్షానికి ఇజ్రాయెల్ అజేయ రక్షణ కవచం తట్టుకుంటుందా? యుద్ధంలో ఎవరి బలమెంత!

  • Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో సంచలనం.. కెప్టెన్‌పై వేటు.. బాబర్‌కు బైబై.. జట్టులో ఊచకోతలు!

  • Ajit Pawar Plame crash: అజిత్ పవార్ విమానం ఎలా కుప్పకూలింది.? AAIB సంచలన నివేదిక..

  • Pakistan: సౌదీకి మద్దతుగా పాకిస్తాన్ ఇరాన్‌పై యుద్ధం చేస్తుందా..?

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions