పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు అన్నదాతలకు కేంద్ర శుభవార్త తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్, రబీ సీజన్లో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు వంటి వాటికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్రం ఇప్పటికే ఉన్న నాలుగు రాష్ట్రపతి శౌర్య పతకాలను తక్షణమే అమల్లోకి వచ్చేలా ఒకే పతకంగా విలీనం చేసింది. ఇప్పుడు అది 'ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ'గా పిలవబడుతుంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న మంత్రాలయంలో నిర్వహించే సభకు రావాలని ఆహ్పానించామన్నారు.
భారతదేశంలోని తమ ప్లాట్ఫారమ్ల నుంచి పిల్లల లైంగిక వేధింపుల విషయాలను తొలగించాలని ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఎక్స్ గతంలో ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రామ్లకు నోటీసులు జారీ చేసింది.
రెండేళ్లలో దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం అన్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలలో భద్రతా పరిస్థితిని సమీక్షించే సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా.. 2022 సంవత్సరంలో గత నాలుగు దశాబ్దాలలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అతి తక్కువ హింస, మరణాలు సంభవించాయని చెప్పారు.
విశాఖ ఉక్కు అప్పులను నష్టాలుగా చూపించి కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అన్యాయం అంటూ సీతారాం ఏచూరి మండిపడ్డారు. వ్యవస్థను మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెడుతోంది అని ఆయన విమర్శలు గుప్పించారు.
Debit: దేశంలోని ప్రతి పౌరుడిపై అప్పుల భారం పెరుగుతోంది. ఇది మేం చెప్పడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రభుత్వ స్థూల రుణంలో 2.2 శాతం పెరుగుదల నమోదైంది.
పోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే వయస్సు వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి లా కమిషన్ కీలక సూచనలు చేసింది. సమ్మతి వయస్సు 18 ఏళ్లేనని, 16కి తగ్గించవద్దని లా కమిషన్ కేంద్రానికి సూచించింది.
ప్రతి నెల కొన్ని రూల్స్ మారుతుంటాయి.. అదే విధంగా వచ్చే నెలలో కూడా కొత్త రూల్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే.. అదే విధంగా అక్టోబర్ నెలకు కూడా కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. అక్టోబర్లో పండుగ హడావుడి కూడా ఊపందుకుంటుంది. అక్టోబర్లో అమలులోకి రాబోయే కొన్ని కొత్త రూల్స్ ఉన్నాయి. ఇందులో మీ డబ్బుపై ప్రభావం చూపేవి కూడా ఉన్నాయి.. అవేంటో ఒక్కసారి చూద్దాం పదండీ.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న…