Gidugu Rudra Raju: కేంద్ర ప్రభుత్వం కుల గణన వివరాలను బహిర్గతం చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న మంత్రాలయంలో నిర్వహించే సభకు రావాలని ఆహ్పానించామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో తెలియజేస్తానని ఖర్గే హామీ ఇచ్చారు.. రాహుల్ గాంధీ చేసిన “భారత్ జోడో” యాత్ర ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్బంగా మంత్రాలయంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం అని రుద్రరాజు పేర్కొన్నారు. “కుల గణన” పై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు కృతజ్ణతలు తెలిపాను అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Read Also: Viral Video : ఇదేందయ్యా ఇది.. ఇలా తయారైయ్యారేంట్రా జనాలు..
Also Read
- 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- Siddipet District: కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
“కాంగ్రస్ వర్కింగ్ కమిటీ” సమావేశంలో “కుల గణన” పైనే విస్తృతంగా చర్చ జరిగింది అని సీడబ్య్లూసీ సభ్యులు రఘువీరా రెడ్డి అన్నారు. 2011లో యుపీఏ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన “కుల గణన” వివరాలను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. 2013-14లో కర్నాటక సీఎంగా సిద్దరామయ్య ఉన్నప్పుడు నిర్వహించిన “కుల గణన” వివరాలను వచ్చే నవంబర్ లో బహిర్గతం చేయబోతున్నట్లు ఈ రోజు జరిగిన “సీడబ్ల్యుసీ” సమావేశంలో కర్ణాటక సీఎం తెలిపారు అని ఆయన అన్నారు.
Read Also: CM Jagan Review: కృష్ణాజలాలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమావేశం
“కుల గణన” వలన సరైన రీతిలో సామాజిక, రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు జరుగుతాయని రఘువీరారెడ్డి అన్నారు. “సమ సమాజ” స్థాపనకు “కుల గణన” దోహదం చేస్తుందనే విశ్వాసం తో ఉన్నాం.. పండిట్ నెహ్రూ నుంచి, ఇందిరా గాందీ, రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ “సామాజిక న్యాయం”కు కట్టుబడి ఉంది.. అలాగే, మోడీ ప్రభుత్వం చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై కూడా చర్చించాం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తో సహా రానున్న లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావడం లాంటి అంశాలపై చర్చించామని రఘువీరా రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్లుక్ వచ్చేసింది!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!