Gidugu Rudra Raju: కేంద్ర ప్రభుత్వం కుల గణన వివరాలను బహిర్గతం చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న మంత్రాలయంలో నిర్వహించే సభకు రావాలని ఆహ్పానించామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో తెలియజేస్తానని ఖర్గే హామీ ఇచ్చారు.. రాహుల్ గాంధీ చేసిన “భారత్ జోడో” యాత్ర ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్బంగా మంత్రాలయంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం అని రుద్రరాజు పేర్కొన్నారు. “కుల గణన” పై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు కృతజ్ణతలు తెలిపాను అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Read Also: Viral Video : ఇదేందయ్యా ఇది.. ఇలా తయారైయ్యారేంట్రా జనాలు..
Also Read
- Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
- Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్పై ఫిర్యాదు.. రాహుల్గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
- Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్బై!
- Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి...
“కాంగ్రస్ వర్కింగ్ కమిటీ” సమావేశంలో “కుల గణన” పైనే విస్తృతంగా చర్చ జరిగింది అని సీడబ్య్లూసీ సభ్యులు రఘువీరా రెడ్డి అన్నారు. 2011లో యుపీఏ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన “కుల గణన” వివరాలను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. 2013-14లో కర్నాటక సీఎంగా సిద్దరామయ్య ఉన్నప్పుడు నిర్వహించిన “కుల గణన” వివరాలను వచ్చే నవంబర్ లో బహిర్గతం చేయబోతున్నట్లు ఈ రోజు జరిగిన “సీడబ్ల్యుసీ” సమావేశంలో కర్ణాటక సీఎం తెలిపారు అని ఆయన అన్నారు.
Read Also: CM Jagan Review: కృష్ణాజలాలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమావేశం
“కుల గణన” వలన సరైన రీతిలో సామాజిక, రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు జరుగుతాయని రఘువీరారెడ్డి అన్నారు. “సమ సమాజ” స్థాపనకు “కుల గణన” దోహదం చేస్తుందనే విశ్వాసం తో ఉన్నాం.. పండిట్ నెహ్రూ నుంచి, ఇందిరా గాందీ, రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ “సామాజిక న్యాయం”కు కట్టుబడి ఉంది.. అలాగే, మోడీ ప్రభుత్వం చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై కూడా చర్చించాం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తో సహా రానున్న లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావడం లాంటి అంశాలపై చర్చించామని రఘువీరా రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
-
Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్పై ఫిర్యాదు.. రాహుల్గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
-
Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
-
Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్బై!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!