Sri Ram Janbhoomi Trust: విదేశీ విరాళాలు స్వీకరించేందుకు రామ మందిర ట్రస్టుకు కేంద్రం అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Ram Janbhoomi Trust: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విదేశీ వనరుల నుంచి విరాళాలను స్వీకరించేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈరోజు తెలిపారు. అలాంటి విరాళాలను ఢిల్లీలో ఉన్న ఎస్బీఐ ప్రధాన శాఖలోని ట్రస్ట్కు సంబంధించిన నిర్దేశిత బ్యాంక్ ఖాతాకు పంపవచ్చని ఆయన చెప్పారు.
Also Read: IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్లో తెలంగాణకు చెందిన విద్యార్థి ఆత్మహత్య
Also Read
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
- EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
“శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ప్రకారం స్వచ్ఛంద విరాళాలను స్వీకరించడానికి భారత ప్రభుత్వంలోని హోం మంత్రిత్వ శాఖలోని FCRA (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) డిపార్ట్మెంట్ ఆమోదించింది” అని ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్లో తెలిపారు. విడిగా విడుదల చేసిన మీడియా ప్రకటనలో.. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని FCRA విభాగం, విదేశీ వనరుల నుంచి స్వచ్ఛంద సహకారాన్ని స్వీకరించడానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం’ ట్రస్ట్ను నమోదు చేసిందని ఆయన వెల్లడించారు. “దయచేసి అటువంటి విరాళాలను 11 సంసద్ మార్గ్, న్యూఢిల్లీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్లో ఉన్న బ్యాంక్ ఖాతాకు మాత్రమే పంపగలరని దయచేసి గమనించండి” అని ఆయన చెప్పారు.
Also Read: Benjamin Netanyahu: మేం చేయగలిగినదంతా చేస్తున్నాం.. కానీ హమాస్ ప్రజల్ని కవచాలుగా వాడుకుంటోంది..
అయోధ్యలో మూడంతస్తుల రామాలయం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని, జనవరి 22న పవిత్రోత్సవం జరుగుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. జనవరి 20 మరియు 24 మధ్య ఏదైనా రోజున ‘ప్రాణ్ ప్రతిష్ఠ’కు సంబంధించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని కూడా మిశ్రా చెప్పారు. తుది తేదీని ప్రధానమంత్రి కార్యాలయం ఇంకా తెలియజేయలేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
-
CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
-
Healthy Jackfruit Tacos : హెల్తీ మినీ జాక్ఫ్రూట్ టాకోస్.. టేస్టీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి.!
-
Monalisa : సిపిఎం అగ్రనేతలకు మోనాలిసా ‘పోక్సో’ సెగ?
-
TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!