వామ్మో.. ఆడోళ్లు ఎంతకు బరి తెగిస్తున్నారు. ప్రియుడితో సుఖానికి అడ్డొస్తున్నారని.. కట్టుకున్నవాళ్లనే కాటికి పంపించేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ హత్య మరువక ముందే జైపూర్లో మరో హత్య కలవరం పుట్టిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
బెంగళూరులో దారుణం జరిగింది. అర్ధరాత్రి దుండగుడు హాస్టల్లోకి ప్రవేశించి యువతిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.