ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ప్రధాని మోడీ కెనడా చేరుకున్నారు. కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘనస్వాగతం లభించింది. ఈరోజు, రేపు కెనడాలో పర్యటించనున్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం కెనడాలో జరగబోయే జీ-7 సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తొలిసారి ప్రధాని మోడీ కెనడా వెళ్తున్నారు.
India Canada: కెనడా ఇప్పుడిప్పుడే దారికి వస్తోంది. గతంలో, జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలిచాడు. తన రాజకీయాల కోసం భారత్తో సంబంధాలను పణంగా పెట్టాడు. ప్రస్తుతం, మార్క్ కార్నీ ప్రధానిగా గెలిచిన తర్వాత భారత్తో కెనడా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. జీ -7 సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని కెనడా ఆహ్వానించింది. స్వయంగా కెనడా ప్రధాని కార్నీ మోడీకి ఫోన్ చేశారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 15-17 వరకు కెనడాలోని అల్బెర్టాలో జరగబోయే గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెళ్లనున్నారు. ఇటీవల, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసిన జీ-7 సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు, దీనికి మోడీ ఒప్పుకున్నారు. అయితే, కెనడాకు వెళ్తూ, మార్గం మధ్యలో సైప్రస్లో ప్రధాని మోడీ ఆగనున్నట్లు తెలుస్తోంది.
G7 Summit: కెనడాలోని ఆల్బెర్టాలో జూన్ 15-17 వరకు జరుగబోతున్న G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం రాకపోవడమో లేక ఆయనే ఈ సమావేశానికి వెళ్లకపోవడమో జరుగుతుందని అందరూ అంచనా వేశారు. అయితే, శుక్రవారం కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి సమావేశాలకు రావాలని కోరారు. ఆయన…
G7 Summit: కెనడాలోని అల్బెర్టాలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న జీ7 సమ్మిట్ కు భారతదేశానికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కెనడా ప్రధాని మార్క్ కార్నే ఫోన్ చేసి సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు.
PM Modi: కెనడాలో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. జీ-7 అనేది ప్రపంచంలోని అత్యంత పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, యునైటెడ్ స్టేట్స్, కెనడాల కూటమి. అయితే, ఈ సమావేశాలకు యూరోపియన్ యూనియన్(ఈయూ), ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్, ఐక్యరాజ్యసమితికి ఆహ్వానాలు అందాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను తాను ప్రతిపాదించిన $175 బిలియన్ల ‘గోల్డెన్ డోమ్’ క్షిపణి రక్షణ వ్యవస్థలో ఉచితంగా చేరాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ షరతు విధించారు. “వారు ఒక ప్రత్యేక దేశంగా ఉంటే వారికి $61 బిలియన్లు ఖర్చవుతుందని నేను కెనడాకు చెప్పాను, కానీ వారు అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరితే వారికి సున్నా డాలర్లు ఖర్చవుతాయి” అని ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చారు.…