Canada: భారత్తో దోస్తీకి ఇదే మంచి సమయం..
- భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది..
- పరస్పర ఆర్థిక సహకారం, జాతి భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చిస్తాం..
- భారత్తో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం: కెనడా ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: ఆర్థిక రంగంలో పరుగులు పెడుతున్న భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కెనడా ప్రభుత్వం వెల్లడించింది. అధిక పన్నులు విధించి విసిగిస్తున్న అమెరికాతో.. వాణిజ్య సంబంధాలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. భారత్తో చర్చలు జరపాల్సిన అవసరాన్ని గురించి తెలియజేశారు. వచ్చేవారం అల్బెర్టా వేదికగా జరగనున్న జీ7 సమ్మిట్ కు భారత ప్రధాని మోడీని ఆహ్వానించడంపై అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో కెనడా సర్కార్ ఈ మేరకు రియాక్ట్ అయింది. ఆర్థిక ప్రాధాన్యతలపై చర్చించడానికి జీ7 సమావేశం కీలకమైన వేదిక అని కెనడా అంతర్జాతీయ వాణిజ్యశాఖ మంత్రి మనీందర్ సిద్ధూ కామెంట్స్ చేశారు.
Read Also: Story Board : హైదరాబాద్లో పబ్బులు, రిసార్టులు మాటున జరిగేదేంటి..?
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
అయితే, కెనడా ఆర్థిక ప్రాధాన్యతలపై చర్చించడానికే జీ7 సమావేశం ముఖ్యమైన వేదిక.. పరస్పర ఆర్థిక సహకారం, జాతి భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది అని కెనడా మంత్రి మనీందర్ చెప్పుకొచ్చారు. కొందరి నాయకులను ఆహ్వానించడంపై స్థానిక నేతల నుంచి విమర్శలు రావడం మంచిది కాదు.. కానీ, ఈ ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. మన సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత్ మనకు ముందున్న ఒక అవకాశం అని ఆయన తెలిపారు. జీ7 సదస్సులో ప్రధానంగా జాతి భద్రత, విదేశీ జోక్యం అంశాలపై చర్చించబోతున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇప్పటికే స్పష్టం చేశారు.. పరస్పర ఆర్థిక సహకారం పైనా ఈ సదస్సులో చర్చించబోతున్నట్లు మనీందర్ సిద్ధూ పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu Naidu: ఆ ఆటలు నా దగ్గర సాగవు.. తోక తిప్పితే ఎవ్వరిని ఉపేక్షించను..!
ఇక, కెనడా గడ్డపై హింసకు తావులేదని మనీందర్ సిద్ధూ తేల్చి చెప్పారు. భారత్తో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి.. ఫేస్ టూ ఫేస్ మాట్లాడాలన్నా జీ7 సదస్సు ఓ చక్కని వేదికని వెల్లడించారు. జస్టిన్ ట్రూడో అధికారంలో ఉన్నప్పుడు ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని ఆయన ఆరోపించడంతో.. భారత్, కెనడాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయని గుర్తు చేశారు. దీంతో క్రమంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా బలహీనపడ్డాయి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..