విదేశాల్లో భారతీయ వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉందని ఎగుమతి లెక్కలు చెబుతున్నాయి. సోమవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక వాణిజ్య డేటా ప్రకారం.. భారతదేశం మొత్తం ఎగుమతులు (వస్తువులు మరియు సేవలతో సహా) ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో $200.3 బిలియన్లకు చేరాయి.
ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగింది. మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉంది. అంతకుముందు ఏప్రిల్లో ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉంది. కాగా.. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను గణాంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్లెట్.. మన 'ముకుంద జ్యువెల్లర్స్'. ఈ నెల 11న(రేపే) హైదరాబాబాద్లోని సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్లలో బ్రాంచ్లను కలిగి ఉన్న 'ముకుంద జ్యువెల్లర్స్'.. సోమాజిగూడలోని సీఎం క్యాంపస్ ఎదురుగా తన నూతన బ్రాంచ్ను ప్రారంభిస్తోంది.
యాప్ ద్వారా క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా.. సొంతంగా మ్యాపింగ్ సర్వీస్ క్రియేట్ చేసింది. ఇంతకుముందు ఇది గూగుల్ మ్యాప్స్ని ఉపయోగించేది. ఇటీవల ఓలా మైక్రోసాఫ్ట్ యొక్క అజూర్ ప్లాట్ఫారమ్ నుంచి నిష్క్రమించింది.
Koo App Shutdown : ఎక్స్ (ట్విటర్) కు ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించిన దేశీయ అప్లికేషన్ ‘ కూ ‘ (Koo) యాప్ మూసివేయబడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫాం తాజాగా తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ బుధవారం లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. సేల్ పై డైలీ హంట్తో సహా వివిధ కంపెనీలతో జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. Hathras stampede: “భోలే బాబా”…
భారతీయ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ తన చెల్లింపు యాప్ను విడుదల చేసింది. సూపర్.మనీ పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోన్పే నుంచి విడిపోయిన తర్వాత ఫ్లిప్కార్ట్ తన యాప్ను మార్కెట్లోకి విడుదల చేసింది.
మహారాష్ట్రలోని అమరావతిలో ఎయిర్ ఇండియా ఫ్లయింగ్ స్కూల్ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ ఫ్లయింగ్ స్కూల్లో ప్రతి సంవత్సరం 180 మంది పైలట్లకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. పైలట్ల కొరతను ముందే ఊహించి, ఎయిర్ ఇండియా మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక ఫ్లయింగ్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Inflation : ఎండల తీవ్రత కారణంగా ద్రవ్యోల్బణం మరోసారి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. గత ఏడాది కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు 65 శాతం పెరిగాయి.