Stock Markets: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రభావం.. ఆల్టైమ్ రికార్డు స్థాయికి స్టాక్ మార్కెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Markets: ఎగ్జిట్ పోల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి చారిత్రాత్మక విజయం సాధిస్తారని అంచనా వేసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 3.58 శాతం లాభపడగా.. సెన్సెక్స్ 3.55 శాతం లాభపడి ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 2,621.98 పాయింట్ల లాభంతో 76,583.29 వద్ద, నిఫ్టీ 807.20 పాయింట్ల లాభంతో 23,337.90 వద్ద ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలకు చెందిన అన్ని స్టాక్లు భారీ లాభాల్లో ఉన్నాయి. ఈ స్టాక్స్ 3 నుండి 7 శాతం లాభాలబాటలో ఉన్నాయి.
Read Also: Air Show: పోర్చుగల్ ఎయిర్ షోలో రెండు విమానాలు ఢీ, పైలట్ మృతి.. వీడియో
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
బ్యాంక్ నిఫ్టీ సూచీ తొలిసారి 50,000 మార్క్ను అధిగమించింది. అంతేకాకుండా, నిఫ్టీ స్మాల్క్యాప్ 100, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ కూడా దాదాపు 3 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ PSU బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఒక్కొక్కటి 4-5% మధ్య పెరిగాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మేలో కనిపించిన మార్కెట్ ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా ప్రకారం 2023-24 (FY24)లో 8.2% ఆర్థిక వృద్ధి రేటు నేపథ్యంలో ఇది వస్తుంది.
2024 లోక్సభ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు BJPకి హ్యాట్రిక్ని అంచనా వేసింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చారిత్రాత్మకంగా మూడవసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.ఎన్డీఏ 2019లో 353 సీట్లను అధిగమించి 350-380 సీట్లతో గెలుపొందే అవకాశం ఉందని చాలా సర్వేలు చెప్పాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా పోల్ ఎన్డీఎకి 361–401 సీట్లు, ఇండియా కూటమికి 131–166 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!