Stock Markets: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రభావం.. ఆల్టైమ్ రికార్డు స్థాయికి స్టాక్ మార్కెట్లు
Stock Markets: ఎగ్జిట్ పోల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి చారిత్రాత్మక విజయం సాధిస్తారని అంచనా వేసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 3.58 శాతం లాభపడగా.. సెన్సెక్స్ 3.55 శాతం లాభపడి ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 2,621.98 పాయింట్ల లాభంతో 76,583.29 వద్ద, నిఫ్టీ 807.20 పాయింట్ల లాభంతో 23,337.90 వద్ద ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలకు చెందిన అన్ని స్టాక్లు భారీ లాభాల్లో ఉన్నాయి. ఈ స్టాక్స్ 3 నుండి 7 శాతం లాభాలబాటలో ఉన్నాయి.
Read Also: Air Show: పోర్చుగల్ ఎయిర్ షోలో రెండు విమానాలు ఢీ, పైలట్ మృతి.. వీడియో
Also Read
- Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
- PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
- AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
బ్యాంక్ నిఫ్టీ సూచీ తొలిసారి 50,000 మార్క్ను అధిగమించింది. అంతేకాకుండా, నిఫ్టీ స్మాల్క్యాప్ 100, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ కూడా దాదాపు 3 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ PSU బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఒక్కొక్కటి 4-5% మధ్య పెరిగాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మేలో కనిపించిన మార్కెట్ ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా ప్రకారం 2023-24 (FY24)లో 8.2% ఆర్థిక వృద్ధి రేటు నేపథ్యంలో ఇది వస్తుంది.
2024 లోక్సభ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు BJPకి హ్యాట్రిక్ని అంచనా వేసింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చారిత్రాత్మకంగా మూడవసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.ఎన్డీఏ 2019లో 353 సీట్లను అధిగమించి 350-380 సీట్లతో గెలుపొందే అవకాశం ఉందని చాలా సర్వేలు చెప్పాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా పోల్ ఎన్డీఎకి 361–401 సీట్లు, ఇండియా కూటమికి 131–166 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
-
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!