పార్టీలో లేరు…. పార్టీతో సంబంధం లేదు. కానీ… అధిష్టానం పిలుపునిచ్చిందంటూ…. సడన్గా ఓ గ్రూప్ గులాబీ కండువాలు మెడలో మెడలో వేసుకుని వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసింది. గులాబీ పార్టీకి జై కొట్టింది. అది చూసి… పార్టీ కేడరే నోరెళ్ళబెట్టాల్సి వచ్చిందట. ఇంతకీ ఎక్కడ జరిగిందా విచిత్ర ఘటన? ఎందుకలా కొత్త గ్రూప్ రోడ్డు మీదికి వచ్చి ఆందోళ చేసింది? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం. 2014లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్లోళ్ల కిష్టారెడ్డి…
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా 18,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. వివిధ మార్గాల్లో ప్రజలపై విద్యుత్ భారం మోపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గృహ అవసరాలకు నెలకు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జ్ ఐదు రెట్లు పెంచాలని భావిస్తోందని, పది రూపాయలు ఉన్న ఛార్జీని 50 రూపాయలు చేయాలని భావిస్తోందన్నారు. ఇళ్ళల్లో…
నిజామాబాద్ జిల్లాలో నుడా చైర్మన్ కేశ వేణు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ వన్ పరీక్షల విషయంలో బీఆర్ఎస్ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టను మాసకబార్చే ప్రయత్నం చేసారు.. కానీ పరీక్షలకు అనుమతి లభించిందన్నారు మంత్రి జూపల్లి. సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయమని, కాంగ్రెస్…
సిగ్గులేకుండా మల్లన్నసాగర్ నిర్వాసితులకు కేసీఆర్ అన్యాయం చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, మూసీ బాధితులకు సీఎం రేవంత్ ఏం న్యాయం చేశారన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, కాంగ్రెస్ తెచ్చిన భూ చట్టం కంటే మెరుగైన సహాయం మేము చేశామన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక్క ఇల్లు అయిన కట్టించారా అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని, ఒక్క గజ్వేల్ లొనే 3 వేలకు…
ఇబ్రహీంపట్నoలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిర్వహించిన దసరా సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాళ్ల పాలనలో ఈ సారి దసరా దసరా లెక్క లేదు, బతుకమ్మ, వినాయక చవితి పండుగలు గతంలో మాదిరిగా జరగలేదన్నారు. రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గతంలో అన్నాడని, కేసీఆర్ ముష్టి రూ. 10 వేలు…
వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టడం రాష్ట్ర రైతంగాన్ని మోసం చేయడమే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా పోయినట్లే అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇచ్చిన ప్రకటన కు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు.…
KTR: రైతు భరోసా పై బీఆర్ఎస్ నేడు నిరసనకు పిలుపు నిచ్చింది. మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు.
ప్రభుత్వం మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టిన గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేసిన మరుసటి రోజు, శనివారం కూడా ఆశావహులు తమ నిరసనను కొనసాగించి అశోక్ నగర్లో భారీ నిరసన చేపట్టారు. క్రాస్ రోడ్డు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఔత్సాహికులతో అనేక కోచింగ్ సెంటర్లు , నివాస ప్రాంగణాలను కలిగి ఉన్న అశోక్ నగర్ ప్రాంతంలో తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఔత్సాహికులతో వాపు ప్రారంభమైంది. సూడెంట్స్ ర్యాలీలు చేపట్టే…