Madhavaram Krishna Rao: కుల గణన సర్వే చేయడానికి వచ్చిన అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే
- కూకట్ పల్లి ఎమ్మెల్యే ఇంటికి సర్వే అధికారులు
- గతంలో బీఆర్ఎస్ సర్వే సందర్భంగా రేవంత్ మాట్లాడిన వీడియో చూయించిన ఎమ్మె్ల్యే
- ఏ మోహంతో సర్వేకు వచ్చారని నిలదీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కుల గణన సర్వే చేయటానికి అధికారులు వచ్చారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడినా వీడియోను అధికారులకు చూపించి ఇప్పుడు ఏ మోహంతో రేవంత్ రెడ్డి సర్వే చేపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు, అంతస్తులు, వాహనాలు తదితర స్థిర చర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని నిలదీశారు. గడువులోపు సర్వే పూర్తీ చేయాలనే ఆతృతలో తప్పులు దొర్లే ప్రమాదం ఉందన్నారు. ప్రజలకు సరైన న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని కోరారు. మొదట ప్రజాప్రతినిధుల వివరాలు సేకరించే కంటే ప్రజల వివరాలు సేకరించాలని సూచించారు. ప్రజలకు సర్వే పేరిట అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.
READ MORE: Nag Ashwin: బాలీవుడ్ భామతో పాన్ ఇండియా లేడీ ఓరియెంటెడ్ సినిమా!!
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
ఇదిలా ఉండగా.. ఆదివారం హనుమకొండలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీసీల ఓట్ల కోసం ఇప్పుడు కుల గణన అని కొత్త నినాదం ఎత్తుకున్నారని, సర్వే కోసం ఇంటికి వెళ్తే అధికారులను జనం నిలదీస్తున్నారన్నారు. బీసీలకు సబ్ ప్లాన్ అని చెప్పారని.. ఒకటన్న అమలు అయ్యాయా? అని ప్రశ్నించారు. కుల గణనలో కేవలం కులాలకు సంబంధించిన సమాచారం మాత్రమే తీసుకోండి.. ఆర్థిక అంశాలను ఆ ఫార్ములా నుంచి తొలగించండని తెలిపారు. కులాలకు సంబంధించిన వివరాలు సేకరించేలాగా ఫామ్ రూపొందించండని డిమాండ్ చేశారు. కుల గణన చేసిన 42% రిజర్వేషన్లు అమలు అయ్యేలాగా చేయాలని.. తమ ఎమ్మెల్యేల మీద దాడులు చేయడం కాదన్నారు. ఇచ్చిన మాటను మీద నిలబెట్టుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!