దేశ రాజధాని ఢిల్లీలో BRS ఆఫీసు ప్రారంభించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్. అబ్కీ బార్.. కిసాన్ సర్కార్ అనే నినాదంతో పాగా వేయడానికి చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పొలిటికల్ స్పేస్ ఉన్న రాష్ట్రాలపై కేసీఆర్ నజర్ ఉంది. ఆ విధంగా తెలుగు రాష్ట్రమైన ఏపీపైనా ఆరా తీస్తున్నారట. ఇప్పటికే BRS విస్తరణ దిశగా చర్యలూ మొదలైనట్టు తెలుస్తోంది. మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు…
సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్బై చెప్పాల్సిందేనంటూ పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ముగింపు సభకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలిపారు. రాజరాజేశ్వరి మాత, కొండగట్టు హనుమాన్ ల ఆశీర్వాదం తీసుకుని, మాట్లాడుతా.. ఒక మంచి ఎంపీ బండి సంజయ్…
యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం కొసం ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మండలాలపై పట్టు సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే. అయితే ఆమె చర్యలు పార్టీ కేడర్లో అసంతృప్తికి కారణం అవుతున్నాయట. చాలాకాలంగా ఎమ్మెల్యే సునీతా ఆమె భర్త నల్లగొండ DCCB ఛైర్మన్ మహేందర్ రెడ్డిలు మండలాల వారీగా సీనియర్లను కాదని మరికొందరిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారపార్టీలో మొదటి నుంచి ఉన్న…