BL Santosh: హైదరాబాద్ కు బీఎల్ సంతోష్.. సర్వత్రా ఆసక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BL Santosh Visit Hyderabad: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. రేపు ఎల్లుండి సమీర్పేటలో నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాల కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. అసెంబ్లీ విస్తారకులు, తెలంగాణ ఇన్ఛార్జ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పోలింగ్ బూత్ కమిటీల నియామకం, మండల స్థాయి కమిటీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
Read also: Astrology: డిసెంబర్ 27, మంగళవారం దినఫలాలు
Also Read
కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఎల్ సంతోష్ తొలిసారిగా హైదరాబాద్ కు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఎల్ సంతోష్ వస్తోంది మాత్రం ఎమ్మెల్యేల కొనుగోలు చేసే విషయంలో కాదు.. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్ లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు బీఎల్ సంతోష్ వస్తున్నారు. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్లో ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. 29న జరిగే సమావేశంలో అసెంబ్లీ ఇంచార్జిలు, కన్వీనర్లు, విస్తారకులు, పాలకులు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఏం చేయబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై సీఆర్పీసీ 41 కింద సీఆర్పీసీ 41 కింద బీఎల్ సంతోష్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినా ఆయన విచారణకు రాలేదు. బీజేపీ రాష్ట్ర శిక్షణ తరగతులు, కార్యవర్గ సమావేశాలకు కూడా బీఎల్ సంతోష్ రాలేదు. అదే సమయంలో గుజరాత్లో ఎన్నికలు జరుగుతున్నందున.. అధికారికంగా ఆయా పనుల్లో బిజీబిజీగా ఉండడం వల్లే కార్యక్రమాలకు హాజరుకాలేదని నేతలు తెలిపారు. సిట్ నోటీసులపై బీఎల్ సంతోష్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు స్టే విధించింది.
Read also: Ben Stokes: ఐసీసీపై బెన్ స్టోక్స్ ఆరోపణలు.. షెడ్యూల్పై శ్రద్ధ ఏదీ..?
ఈ కేసులో బీఎల్ సంతోష్ పాత్ర ఉందని అనుమానిస్తున్న అధికారులు.. విచారణకు అనుమతించాలని హైకోర్టును ఆశ్రయించినా.. కోర్టు స్టేను పొడిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే సంతోష్ హైదరాబాద్ వస్తున్నాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పుడు సిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అందుకు బీజేపీ వేసిన ప్లాన్ రాష్ట్ర ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ ఆసక్తికరంగా మారింది.
Read also: Rohingya Refugees: నెల రోజులు నడి సముద్రంలోనే.. చివరికి గాలులతో..
తాజావార్తలు
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
-
Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!