Boianapalli Vinod Kumar : దేశంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కరెంట్ లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులపై అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో బీఆర్ఎస్ నేతలు చేసిన నిరసనల్లో ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కరెంట్ లేదని వ్యాఖ్యానించారు. దయనీయ పరిస్థితిలో కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయని, కమ్యూనిటీస్ స్టోరేజ్ కింద కల్లాలను నిర్మించామని, 40,199 మందికి డబ్బులు ఉపాధి హామీ కింద ఇచ్చామన్నారు. జీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన డబ్బులలో 150 కోట్లను రికవరీ చేశారని, కేంద్రం డబ్బులు రికవరీ చేయడంపై నిరసనగానే ధర్నా చేశామన్నారు. రోడ్లపై వడ్లు ఆరబెట్టితే అరెస్ట్లు, ఫైన్ లు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందని, కేసీఆర్ ముందు చూపుతో కల్లాలు నిర్మిస్తే రికవరీ చేశారని, సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పాలన్నారు. ఓర్వలేక తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం గొంతు నొక్కి చంపాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలని చైతన్య పరచడానికే బీఆర్ఎస్ పెట్టామని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Bajrang Dal: “లవ్ జిహాద్” కోసం పబ్బులను వినియోగిస్తున్నారు.. న్యూ ఇయర్ పార్టీలను బ్యాన్ చేయాలి.
ఇదిలా ఉంటే.. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని చౌరస్తా సెంటర్ లో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతువ్యతిరేక విధానాలకు నిరసనగా వినూత్న రీతిలో రైతులకు, రైతు కూలీలకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులతో కలిసి ఉరితాళ్లతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి నిరసన తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతులకు మంచి చేస్తే ఓర్వని కేంద్ర బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పంట కల్లాలు కడితే, ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
తాజావార్తలు
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..