GHMC Standing Council Meeting : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్లో గందరగోళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీహెచ్ఎంసీ పాలకమండలి సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మూడు నెలలకోసారి సమావేశం జరగాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న బల్దియా జనరల్ బాడీ మీటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. అయితే..ఈ కౌన్సిల్ మీటింగ్కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అయితే.. స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యుల గొడవకు దిగారు. దీంతో.. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి సర్ది చెప్పె ప్రయత్నం చేశారు. దీంతో.. సమావేశంలో గందరగోళం ఏర్పడింది. సభను అడ్డుకునే బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నం చేస్తుంటే.. బీఆర్ఎస్ కౌన్సిలర్స్ వారిస్తున్నారు. మేయర్ పొడియంని చుట్టుముట్టి కాంగ్రెస్, బీజేపీ సభ్యులు నిరసనలు చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిలింగ్ మీట్ లోకి మార్షల్స్ ని పిలిచారు మేయర్. అయితే.. మేయర్ కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యుల నినాదాలు చేశారు. సభ్యులను వారిచెందుకు మేయర్ చైర్ దగ్గరకు చేరుకున్న ఓఎస్డీ.. చెప్పినా వినకపోవడంతో వెనుదిరిగారు ఓఎస్డీ. అయితే.. 2022-23 బడ్జెట్ని జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదించింది.
Also Read : YSR Ghat: ఇడుపులపాయలో వైఎస్ జగన్ పర్యటన.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం
అయితే.. ఎలాంటి చర్చ లేకుండా బడ్జెట్ ఆమోదం జరిగిందని మేయర్ ప్రకటన చేశారు. మొత్తం 6224 కోట్లు బడ్జెట్ ఆమోదం తెలిపింది కౌన్సిల్. దీంతో.. డౌన్ డౌన్ మేయర్ అంటూ బీజేపీ కార్పొరేటర్స్ నినాదాలు చేశారు. అజెండా జరిగిన రోజునే మీకు సవరణలు ఉంటే ఆరోజే చెప్పాల్సిందని మేయర్ వ్యాఖ్యానించారు. అనంతరం.. ముగ్గురు సభ్యలతో ఛాంబర్ కు రండి అంటూ మేయర్ ప్రతిపాదించి.. సభను 10 నిమిషాలు వాయిదా వేశారు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. అయితే.. అనంతరం 10 నిమిషాల తరువాత తిరిగి కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైంది. సభలో బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాలు కొనసాగుతున్నాయి. కార్పొరేటర్ల పట్ల ఎమ్మెల్యే లు పెత్తనం చేస్తున్నారని సభ్యుల నినాదాలు చేస్తూ.. మేయర్ పోడియం నుంచి బీజేపీ కార్పొరేటర్లు ముందుకు కదలలేదు. ఓ వైపు మేయర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేస్తుంటే.. మరొ పక్క మోడీ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. దీంతో.. బీజేపీ కౌన్సిలర్స్ పై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మహిళకు ఇచ్చే గౌరవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు వారి స్థానంలోకి వెళ్ళక పోతే సభను వాయిదా వేస్తా అంటూ మేయర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. మేయర్ కు బీజేపీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
Also Read
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!