Bhatti Vikramarka Exclusive Interview: ధరణిలో అనేక భూములను ఎంట్రీ చేయలేదని చేయడం లేదు అని ఆరోపించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. తాను చేపట్టిన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పేదలు అనుభవిస్తోన్న భూములను కూడా భూస్వాముల భూములుగా చూపిస్తోంది ధరణి అని విమర్శించారు. ఇక, గతంలో దున్నేవాడికి భూమి కావాలంటూ అనేక పోరాటు జరిగాయి.. అలా హక్కులు సంపాదించుకున్న తర్వాత.. ఇప్పుడు ధరణిని తీసుకొచ్చి..…
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబానికి చివరి వరకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, రాజకీయాల్లో జగదీష్ మంచి పేరు తెచ్చుకున్నాడని.. కానీ ఆస్తులు సంపాదించుకోలేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయిందని ఆయన అన్నారు. బీజేపీ మహా జన సంపర్క్ అభియాన్ సన్నాహక సభలో ఆయన మాట్లాడారు.
Ponguleti: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతుంది. ఖమ్మంలో ఎస్.ఆర్ కాన్ వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
MLA Seethakka: పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతి పత్రం అందించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటన కొనసాగుతుంది.
పోలీసులపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ మ్యానువల్ పాటించకుండా చట్టాన్ని తుంగలో తొక్కి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రజల భావ వ్యక్తీకరణను అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేయాడాన్ని ఆయన ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర చేసిన ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెడుతున్న తప్పుడు కేసుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారని భట్టి పేర్కొన్నారు.