MLC Jeevan Reddy: కేసీఆర్ అనాలోచిత విధానంతో రాష్ట్రం అప్పుల ఉబిలోకి.. సీఎంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: కేసీఆర్ అనాలోచిత విధానంతో రాష్ట్రం అప్పుల ఉబిలోకి పోయిదంటూ.. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. రూ.4వేల కోట్లతో నీళ్లు అందించే అవకాశం ఉండగా.. మిషన్ భగీరథతో రూ.40 వేల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజల పై రు.1,20,000కోట్ల అప్పుల భారం పడిందని అన్నారు. దీంతో రాష్ట్రాన్ని 2 లక్షల అప్పుల ఊబిలోకి నెట్టారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Dharmana Prasada Rao: పైసా రాలేదు.. చేతి చమురే వదులుతోంది..
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
దశాబ్ది ఉత్సవాల నిర్వహిస్తున్న అధికారులకు, ప్రజా ప్రతినిధులకు.. ధర్మపురిలో నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదు కాన రావడం లేదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ధర్మపురిలో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన.. నిరసన వ్యక్తం చేయకుండా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాగు నీళ్లు కావాలని అడిగితే అరెస్ట్ చేస్తారా.. ఇదేనా సుపరి పాలన అంటే అని నిలదీశారు. ఊరికో ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. రూ. 10లక్షల చొప్పున 1000 కోట్లు, పైపు లైన్, నీటి సరఫరాకు మరో 3000 కోట్లు.. మొత్తం 4000 కోట్లతో రాష్ట్ర ప్రజలందరికీ తాగు నీరు అందించే అవకాశం ఉండేది. కానీ రూ.40 వేల కోట్ల అప్పులు చేశారని సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లాలో మిషన్ భగీరథ నీరు నెలకు నాలుగు సార్లు బందు ఐతున్నాయని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు భగీరథ నీరు తాగుతున్నారా.. అని ప్రశ్నించారు.
Read Also: Ramya Krishna: రాకీభాయ్తో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన శివగామి.. వీడియో వైరల్..
ఒక వైపు తాగునీరు సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే 2 కే రన్ పేరిట డీజే పెట్టుకొని డాన్సులు చేసుడా దశాబ్ది ఉత్సవాలు అంటే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలదీశారు. దశాబ్ది ఉత్సవాలు అంటే ప్రజా అవసరాలు గుర్తించి, పరిష్కరించడం అని మరిచారా అని ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పేరిట రూ.40 వేలకోట్లు అప్పుల భారం ప్రజలపై వేశారన్నారు. రొల్ల వాగు చరిత్ర మంత్రి ఈశ్వర్ కు తెలుసా అని ప్రశ్ని్ంచారు. రాజుల చెరువు అయిన రోల్ల వాగు ద్వారా కాంగ్రెస్ పాలనలో 0.25 టీఏంసీ సామర్థ్యంతో అందించిన దానికన్నా అదనంగా ఒక్క ఎకరానికి నీరు అందించారా నిలదీశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పత్రికల ద్వారా చర్చకు సిద్దమని చెప్పడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. వాస్తవాలు వెలిక్కి రావాలి.. ఏ పథకంపై అయినా, పత్రికా ముఖంగానైనా చర్చకు సిద్దమెనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!