Bhatti Vikramarka Exclusive Interview: భూములు తిరిగి భూస్వాములకు అప్పగించేందుకే ధరణి..!
Bhatti Vikramarka Exclusive Interview: ధరణిలో అనేక భూములను ఎంట్రీ చేయలేదని చేయడం లేదు అని ఆరోపించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. తాను చేపట్టిన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పేదలు అనుభవిస్తోన్న భూములను కూడా భూస్వాముల భూములుగా చూపిస్తోంది ధరణి అని విమర్శించారు. ఇక, గతంలో దున్నేవాడికి భూమి కావాలంటూ అనేక పోరాటు జరిగాయి.. అలా హక్కులు సంపాదించుకున్న తర్వాత.. ఇప్పుడు ధరణిని తీసుకొచ్చి.. మీకు హక్కులు లేవంటే ఎలా? అని ప్రశ్నించారు. భూపోరాటాల తర్వాత భూస్వాములు ఎంతోకొంతకు భూములు అమ్ముకొని వెళ్లిపోయారు.. కానీ, ధరణి వచ్చిన తర్వాత.. భూములు అమ్ముకుని అమెరికా, హైదరాబాద్ వెళ్లిపోయినవారికి పట్టాలు ఇస్తున్నారు. ఇలా చాలా సైలెంట్గా భూములను మళ్లీ భూస్వాములకు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. దీనిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Manchu Manoj: ఆదిపురుష్ కోసం మేము కూడా అంటున్న నవదంపతులు
Also Read
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
- Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించా.. ఆదిలాబాద్లో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.. మేం ఈ రాష్ట్ర బిడ్డలం కాదా? అని ప్రశ్నిస్తున్నారు అని తెలిపారు భట్టి.. ప్రభుత్వం ఎందుకు మమ్మళ్లి ఇలా ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తీర్చాలి.. కానీ, వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదన్నారు.. పోడ భూములకు పట్టాలు లేవు.. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో అడవి బిడ్డలను బయటకు పంపుతున్నారు.. గిరిజనేతరులకు ఏమైనా ఉందా? అంటే అది కూడా లేదు.. పోడు భూముల సమస్యలతో పాటు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇక, తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. మరి.. అదనంగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చారా? అని సవాల్ చేశారు. గతంలో.. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇస్తూ.. ఇప్పుడు మేమే ఇస్తున్నామని ప్రచారం చేయడం ఏంటి? అంటూ కేసీఆర్పై ఫైర్ అయ్యారు భట్టి విక్రమార్క.
Read Also: RBI Recruitment 2023: డిగ్రీ అర్హతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..రూ.71,032 జీతం..
పేదలకు పంచిన భూములను ప్రభుత్వం దుర్మార్గంగా లాక్కుందని మండిపడ్డారు భట్టి విక్రమార్క.. చాలా భూములను ధరణిలో ఎంటర్ చేయలేదని ఆరోపించిన ఆయన.. భూస్వాములకు తిరిగి భూములు అప్పగించేందుకు ధరణి తీసుకొచ్చారని ఆరోపించారు.. ధరణి కంటే ముందే రైతులకు మేలు జరిగింది.. రాష్ట్రంలో కేసీఆర్ అదనంగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టించారా? కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల నుంచే నీరు ఇస్తున్నారని తెలిపారు.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్కమార్క ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Heinrich Klaasen: ఇకపై నాకు ఆడాలనే ఆసక్తి లేదు.. హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Ex MLA Shakeel Son: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసుల షాక్..
-
Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?
-
NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
-
KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!