స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటునే ఉన్నారు. అయితే, మరోసారి కడియం శ్రీహరి పైనా ఎమ్మెల్యే రాజయ్య ఘాటు విమర్శలు చేశారు. జఫర్గడ్ మండల్ హిమ్మత్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై రాజయ్య విమర్శలు గుప్పించారు.
వరంగల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మేము అవినీతి చేశామని ప్రధాని మోడీ అంటున్నారు కదా.. దర్యాప్తు సంస్థలు అన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా?.. ఏమి చేస్తున్నారు?.. మీరు అని ఆయన ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి ప్రకటించారు. విలువలు లేని చోట తాను ఉండలేనని ఆయన పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రియాంకగాంధీ త్వరలోనే నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నట్లు దామోదర్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవికి కూడ ఆయన రాజీనామా చేయనున్నారు.
వరంగల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. దీంతో పాటు పార్టీ పటిష్టత కోసం కమలనాథులు తెలంగాణలో వరుస సమావేశాలు, పర్యటనలు చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ పార్టీ మారుతున్నారనే ప్రచారంతో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇవాళ (ఆదివారం) ఆయన నివాసానికి వెళ్లి ఇద్దరు కాసేపు చర్చించుకున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరో నాటకానికి తెర దీసింది అని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం మీటింగ్ సందర్భంగా బీఆర్ఎస్ అరాచకాలు చేసింది.. బీఆర్ఎస్ అరాచకం వల్లనే సభ గ్రాంఢ్ సక్సెస్ అయ్యింది అని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వున్న కిషన్ రెడికే బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హైకమాండ్ నియమించింది అని తెలిపింది. ఇదే బీఆర్ఎస్, బీజేపీ అనుబందంపై పూర్తిగా అర్థమవుతుందని రేణుకా చౌదరి చెప్పారు. బీఆర్ఎస్ కు కరెంట్…
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ హైకమాండ్ ఫుల్ నజర్ పెట్టింది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన బీజేపీ పార్టీ ఇక జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
CM KCR: సీఎం కేసీఆర్ మహరాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీని ఆ రాష్ట్రంలో బలోపేతం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల్లోని జిల్లాల్లో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరిగాయి.
గత కొంతకాలంగా మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ( శనివారం) మహారాష్ట్రకు చెందిన బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ స్వయంగా కండువా కప్పి వారికి సాదర స్వాగతం పలికారు.