BRS Leaders: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో అధికార పార్టీ బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టారు.
ట్విట్టర్ వేదికగా విజయశాంతి ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నారు అని మంత్రి హరీష్ రావు ఇప్పుడు అంటున్నారు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం.. అయితే.. బీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్లు వారి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెచ్చింది అబద్దం, హాస్యాస్పదం అని ఆమె అన్నారు.
BRS Leaders: మహారాష్ట్రలోని షోలాపూర్లో జరగనున్న పద్మశాలి ఆరాధ్యదైవం మార్కండేయ రథోత్సవంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి వలస వచ్చిన పద్మశాలీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రం తరపున మంత్రులు హాజరుకానున్నారు.
ప్రధాని మోడీ కార్యక్రమాన్ని అధికార బీఆర్ఎస్ ఎందుకు బహిష్కరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
Off The Record: చొప్పదండి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది… పేరుకు ఎస్సీ రిజర్వుడ్ కానీ రాజకీయాలు మాత్రం ఓ రేంజ్లో ఉంటాయి… ఇక్కడ బలమైన రెండు సామాజిక వర్గాలదే హవా… గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభ వైఖరికి వ్యతిరేకంగా మండల స్థాయి నేతలు ఒక్కటయ్యారు. దీంతో ఆమెకు సీటు రాకుండా పోయింది. అదే గ్రూప్ నేతలు… స్థానికుడంటూ సుంకె రవిశంకర్ను ప్రోత్సహించి టికెట్ వచ్చేలా చేశారు… గెలిచేంత వరకు బాగానే ఉంది… తర్వాత ఏడాదిన్నరలోనే…
కులం ఒకటి అయితే మరో కులం పేరు చెప్పుకొని వాళ్ళమాదిరిగా నేను రాజకీయాలు చెయ్యడం లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మద్య ఓ నాయకుడు నాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలని, లేకపోతే పార్టీలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం కేంద్రంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కడియం శ్రీహరి పాల్గొన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న ములుగులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తుంది.